తెలుగు సినీ నటుడు నవదీప్ఆయన తన నటనతో మంచి పేరు సంపాదించుకున్నాడు.తమిళ, కన్నడ సినిమాలలో నటించడమే కాకుండా తెలుగులో బుల్లితెరలో కొన్ని షోలలో హోస్ట్ గా కూడా చేశాడు.
చాలావరకు ఈయన నటన పాత్రకు తగ్గట్టుగా ఉండడమే కాకుండా ఎంతో ఆకట్టుకుంటుంది.
ఈయన 2004 జై సినిమా ద్వారా వెండితెరకు పరిచయం కాగా ఆ సినిమా ఆయనకు మంచి విజయాన్ని అందించడంతో పాటు వరుస అవకాశాలను అందించింది.
అంతే కాకుండా కొన్ని సినిమాలలో అతిధి పాత్రలో కూడా బాగా నటించాడు.ఇక బుల్లితెరలో మొట్టమొదటిసారిగా ప్రారంభమైన రియాలిటీ షో బిగ్ బాస్ 1 లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ అయ్యాడు.
ఇదిలా ఉంటే నవదీప్ తాను సినిమా విషయంలో కథ నచ్చకున్నా ఇతరుల వల్ల ఓకే చేసేవాడట.
నవదీప్ ప్రస్తుతం జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మోసగాళ్లు సినిమా లో నటించారు.ఇందులో మంచు విష్ణు హీరోగా నటించగా కాజల్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో నటించారు.ఇక ఈ సినిమా ఈనెల 19 న విడుదల కానున్న సందర్భంగా నవదీప్ కొన్ని విషయాలను మీడియాతో పంచుకున్నారు.
ప్రస్తుతం నవదీప్ అవనీంద్ర దర్శకత్వంలో లో ఓ ప్రేమ కథతో వస్తున్నా సినిమాను చేయనున్నాడట.నటనతో పాటు ఆయన సీస్పేన్ సంస్థ పనులు కూడా చూసుకుంటున్నాడట.దీని ద్వారా కొత్త రచయితలకు శిక్షణ ఇవ్వడంతో పాటు వాళ్లతోనే కథలు కూడా సిద్ధం చేస్తారట.ఇక మోసగాళ్లు సినిమా కథ గురించి కొన్ని విషయాలు తెలపగా ఈ సినిమా నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపాడు.
ఇక నవదీప్ తన కథల ఎంపికలో తనకు మొదటి నుంచి కన్ఫ్యూజ్ ఉండేదటమనసుకు నచ్చింది చేయాలా? లేక మన దగ్గరికి వచ్చిన కథలు చేసుకుంటూ వెళ్లాలాలని బాగా గందరగోళం అనిపించిందట.కానీ ఈ సమస్య సరైన సక్సెస్ లేని నటుల కే వస్తుందని తెలిపాడు.
అలాంటి సమయం లో తన దగ్గరకు సినీ దర్శకులు, నిర్మాతలు స్క్రిప్టులు తీసుకొచ్చినప్పుడు అవి తనకు నచ్చకున్నా, వాళ్లకి నో చెప్పకుండా చేసేవాడట.దానివల్ల ఎన్నో పరాజయాలు పొందానంటూ ఇప్పుడు దీనికి పరిష్కారం కనుక్కున్నాను అంటూ షూటింగ్ లేకపోతే డబ్బులు తక్కువ ఖర్చు పెట్టుకొని వేరే పనులు చేసుకో కానీ, పిచ్చిపిచ్చిగా చేయొద్దు అనుకుంటూ తనను తానే చెప్పుకునేవాడట.