వెంకటేష్ మీనా ప్రధాన పాత్ర ల్లో తెరకెక్కిన దృశ్యం సినిమా ఐదేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా దృశ్యం 2 విడుదలైంది.
దృశ్యం థియేటర్ల లో విడుదలై సూపర్ హిట్ దక్కించుకున్న విషయం ఆయన అభిమానులు అంత సులభంగా మర్చిపోరు.వెంకటేష్ కెరియర్లోనే బిగ్గెస్ట్ వసూళ్లు నమోదు చేసినట్లు అప్పట్లో ట్రేడ్ విశ్లేషకులు చెప్పుకొచ్చారు.
కానీ దృశ్యం 2 మాత్రం డైరెక్టు ఓటీటీ ద్వారా విడుదల అవ్వడం వల్ల వెంకీ ఒక అరుదైన రికార్డును కోల్పోవాల్సి వచ్చింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దృశ్యం 2 కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యం లో థియేటర్లో కనుక ఈ సినిమా విడుదల అయ్యి ఉంటే కచ్చితంగా మంచి వసూళ్లను దక్కించుకునేది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యం గా బాక్సాఫీస్ పండితులు మాట్లాడుతూ దృశ్యం 2 వంటి ఫ్యామిలీ మూవీస్ ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కు చాలా అవసరం.కరోనా భయం కారణం గా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లలోకి రావడానికి భయపడుతున్నారు.
దృశ్యం 2 వంటి ఫ్యామిలీ నేపథ్యం సినిమా వస్తే కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టే వాళ్ళు.
ఆ కలెక్షన్స్ తో కచ్చితంగా దృశ్యం 2 భారీగా వసూళ్లు నమోదు చేసేది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దృశ్యం 2 డైరెక్ట్ ఓటీటీకి వెళ్లి పెద్ద తప్పు చేశారని, థియేటర్ రిలీజ్ చేసి ఉంటే ఖచ్చితంగా భారీ వసూళ్లు నమోదు అయి ఉండేవి అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మలయాళం లో తెరకెక్కిన దృశ్యం 2 ను కూడా ఓటీటీ ద్వారానే స్ట్రీమింగ్ చేసిన విషయం తెలిసిందే.