ఎక్కడైనా ఎవరైనా ఏదైనా దొంగతనం చేస్తే ఏం చేస్తారు.? పట్టుకుని ఒళ్ళు హూనం అయ్యేలా చితక్కొట్టి పోలీసులకు అప్పగిస్తారు.ఎక్కడైనా ఇదే జరిగేది.ఇప్పుడు లోకమంతా కళ్ళే అన్నట్టు అంతా సీసీ కెమెరాల మయం అయిపొయింది.ఎవరు ఎక్కడ దొంగతనం చేసినా ఆ కెమెరా కన్నుల్లో పడిపోతున్నారు.ఇవన్నీ దొంగతనాలు జరగకుండా అడ్డుకట్ట వేయడానికే.
అయితే ఓ దేశంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా తమ షాపులో దొంగతనం చేయడాని పనోళ్లు కావాలని ఏకంగా ప్రకటన చేసింది.అంతే కాదు… ఇక్కడ దొంగతనాలు చేయడం మాత్రమే కాదు ఆ దొంగతనాలు ఎలా చేశారో చెబితే గంటకు రూ.5000 వేల రూపాలు ఇస్తామని ఆఫర్ కూడా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
బ్రిటన్ దేశానికి చెందిన ఓ షాపు ప్రతినిధి బార్క్ డామ్ వెబ్ సైట్ లో ఈ ప్రకటన విడుదలయ్యింది.క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని జనల సందడి ఎక్కువగా ఉందట.సందట్లో సడేమియాలా ఈ షాపులో దొంగతనాలు విపరితంగా జరుగుతున్నాయని ఆమె వెల్లడించారు.
దింతో ఎలాగైనా దొంగతనాలకు స్వస్తి చేప్పేందుకు దొంగతనాల్లో ఆరితేరిపోయిన తెలివైన దొంగలను పనిలో పెట్టుకోవాలని ఇలా చేశారట.
దొంగతనం ఎలా చేస్తారో అనే విషాయాన్ని చెప్పి స్వయంగా వస్తువులను ఏలా దొంగతనం చేస్తారో చేసి చూపెట్టాలి.అట్ల చేస్తే గంటకు రూ.5,000 చెల్లిస్తామని ప్రకటించారు.వారి సలహాలు, సూచనలతో షాపులో భద్రతను కట్టుదిట్టం చేసేందుకే ఈ ఎత్తుగడ వేశారంట.ఆ దొంగతనాలు ఆగడం సంగతి అలా ఉంచితే ఈ ప్రకటనతో ఆ షాప్ పేరు మాత్రం విపరీతంగా పబ్లిసిటీ అయిపోతోంది.