పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకగ్రీవల విషయంలో అధికార పార్టీకి చెందిన నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు అంటూ విపక్షాలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే ఎలమంచిలి కన్నబాబు ఇటీవల సర్పంచ్ అభ్యర్థి కి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లుప్రతిపక్షాలు ఆరోపించాయి.
అంతేకాకుండా ఆ వాయిస్ రికార్డు ను కూడా ఏపీలో కొన్ని మీడియా ఛానల్స్ వైరల్ చేయడం జరిగింది.
దీంతో తనపై వస్తున్న వార్తలపై ఎమ్మెల్యే కన్నబాబు స్పందించారు.
తన ఆడియో టేప్ అంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు.అంతేకాకుండా సర్పంచ్ అభ్యర్థిగా ఎవరైతే పోటీ చేస్తున్నారో.
సదరు అభ్యర్థి కి ఎన్నిక ఏకగ్రీవం అయితే గ్రామం అభివృద్ధి చెందుతుందని సూచనలు ఇవ్వటం జరిగింది తప్పా, వార్నింగ్ అనేది ఇవ్వలేదని చెప్పుకొచ్చారు.కానీ తాజా మాటలకు అప్పట్లో నాటి మాటలను జతచేసి తమపై బురదజల్లే ప్రయత్నం జరుగుతుంది అని, నిజంగా నేను బెదిరింపులకు పాల్పడింది వాస్తవం అయితే నిరూపిస్తే తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అంటూ కన్నబాబు సవాల్ విసిరారు.
.