ప్రేమ ఎంత మధురంప్రియురాలు అంత కఠినం అనే పాట గురించి మీరు వినే ఉంటారు.సరిగ్గా ఒక అమ్మాయి కూడా ఇలాగే తనని ఎంతగానో ప్రేమించాన అబ్బాయిని కాదని విచిత్రంగా ప్రేమించిన అబ్బాయి వాళ్ళ నాన్నని పెళ్లిచేసుకుంది.
భార్య కావలిసిన ప్రేయసి అమ్మగా మారుతుంటే పాపం అతని పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.అయితే ఆమె ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకోవడం వెనుక ఒక కారణం కూడా ఉందండోయ్.
ప్రేమించిన వ్యక్తితో పాటు అతని తండ్రిని కూడా సంతోషపెట్టడం కోసం ఆమె తన ప్రేమని త్యాగం చేసిందట.మరి ఆ యువతీ అలా ఎందుకు చేసిందో అనే వివరాలు ఒకసారి తెలుసుకుందామా.
,/br>
టిక్టాక్ యూజర్ వైఎస్.అమ్రి అనే యువతికి ఒక బాయ్ఫ్రెండ్ ఉన్నాడు.అతడితో లవ్ లో కూడా ఉంది ఈ అమ్మడు.కొద్ది రోజుల్లో వివాహం చేసుకోవాలని అనుకున్నారు.అయితే అమ్రి ప్రేమించిన వ్యక్తి యొక్క తల్లి మరణించడంతో అతను ఎంతగానో కృంగిపోయాడు.అతనితో పాటు అతని తండ్రి కూడా భార్య మరణాన్ని తట్టుకోలేకపోయాడు.
వీరిద్దరు పడుతున్న బాధను చూసి అమ్రి విలవిలాలాడిపోయింది.వాళ్ళని ఆ బాధ నుండి ఎలా మాములు మనుషులను చేయాలనీ ఆలోచించింది.
ఆ ఆలోచనలో భాగంగా అమ్రి ఒక నిర్ణయం తీసుకుంది.తల్లి లేని ప్రియుడికి తల్లిగా మారాలని, భార్య లేని ప్రియుడు తండ్రికి భార్యగా అవ్వాలని అనుకుంది.
ఈ సందర్భంగా అమ్రి మాట్లాడుతూ.ఇలా వివరణ ఇచ్చింది.మనకి ఇష్టం అయినవాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటుంటే చూస్తూ ఎలా ఉండగలం చెప్పండి.అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను.నా బాయ్ ఫ్రెండ్ అలా అమ్మలేదని బాధపడడం నాకు నచ్చలేదు.అందుకే అతనికి అమ్మలా మారి అమ్మ ప్రేమను ఇస్తూ అతనిని ఓదార్చాలనుకుంటున్నాను.
అంతేకాకుండా ఈ వయసులో అతని తండ్రికి తాను అండగా ఉండి అతని బాధని పోగొట్టాలని ఆమె చెప్పుకొచ్చింది.ఈ క్రమంలో అమ్రి నిర్ణయం పట్ల నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.