పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నేత చింతమనేని ప్రభాకర్ విలేఖరులతో మాట్లాడుతూ అధికార పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఈ క్రమంలో సమాచార శాఖ మంత్రి పేర్ని నాని చంద్రబాబును ఉద్దేశించి కొంగ జపం అంటూ.
చేసిన వ్యాఖ్యలను ఖండించారు.పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు చంద్రబాబు దొంగ చెప్పనంటున్న మంత్రి పేర్ని నాని కి.పచ్చకామెర్లు వచ్చాయని సెటైర్లు వేశారు.వైయస్ జగన్ ది బలుపు గాదు వాపు.
ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికలు పెట్టమనండి నోటిఫికేషన్ రిలీజ్ చేయమనండి.కచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది గెలవకపోతే… పార్టీ కార్యాలయం మూసేస్తాం.
మద్యం షాపు దగ్గరకు వెళితే.వైసిపి వాళ్లే పట్టాభి ని.మించిన స్థాయిలో జగన్ ని తీడుతున్నారని.అవి వినొచ్చు అని విమర్శించారు.
పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకుని మరి రెచ్చిపోతున్నారు.ఇదే క్రమంలో చంద్రబాబు లోకేష్ పై విమర్శలు చేసిన కొడాలి నాని పై కూడా చింతమనేని ఫైర్ అయ్యారు.
కేవలం మంచి పదవిని కాపాడుకోవడం కోసమే కొడాలి నాని విమర్శలు చేస్తున్నారని.త్వరలోనే ఆయన అమ్మ మంత్రిపదవి పోయె.
అవకాశాలు ఉన్నాయని తెలిపారు.ఉప్పు కారం మేరే తింటున్నారా మేము తినటం లేదా మాకు బిపి వస్తుంది అంటూ.
చింతమనేని ధ్వజమెత్తారు.చెట్టెక్కి నోడు ఎప్పటికైనా దిగాల్సిందే.
అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు, వైసిపి నాయకులు గుర్తు పెట్టుకోవాలి అని చింతమనేని వార్నింగ్ ఇచ్చారు.