ఎనిమిది సంవత్సరాలుగా ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో సూపర్ డూపర్ హిట్ గా కొనసాగుతూనే ఉంది.ఈ షో నుండి జడ్జ్ అయిన నాగబాబు వెళ్లి పోయిన సమయంలో జబర్దస్త్ పని అయిపోయింది అని కొందరు అనుకున్నారు.
అదిరింది ఖచ్చితంగా జబర్దస్త్ కు గండి పెడుతుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.కాని నాగబాబు ఏమాత్రం అదిరింది కామెడీ షో తో జబర్దస్త్ ను కదిలించలేక పోయాడు.
ఈ సమయంలో అదిరిందిని బొమ్మ అదిరిందిగా మార్చారు. ఇద్దరు ముగ్గురు యాంకర్ లను మార్చారు.
టీం లను మార్చారు.జడ్జ్ లను మార్చారు.
ఏం మార్చినా కూడా అభిమానుల అభిప్రాయం మాత్రం మారలేదు.అస్సలు తేడా లేకుండా జబర్దస్త్ ను ఆధరిస్తూ అదిరిందిని పక్కకు పెట్టారు.
దాంతో జీ తెలుగు వారు అదిరిందిని మోయలేం బాబోయ్ అంటూ ఎత్తేశారు.
జీ తెలుగులో బొమ్మ అదిరింది కామెడీ షో కు శుభం కార్డు పడింది.దాంతో అందులో ఉన్న కమెడియన్స్ చాలా మంది ఇతర ఛానెల్స్ కు వెళ్తున్నారు.ఇప్పటికే చమ్మక్ చంద్ర మళ్లీ జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చేందుకు అనుమతులు తెచ్చుకున్నాడు అంటున్నారు.
ఇదే సమయంలో నాగబాబు కూడా జబర్దస్త్ లో ఎంట్రీ ఇవ్వాలని జబర్దస్త్ అభిమానులు కోరుకుంటున్నారు.ఇండస్ట్రీలో వెళ్లడం రావడం అనేది చాలా కామన్ గా జరిగేదే.కనుక నాగబాబు మళ్లీ వస్తాను అంటే జబర్దస్త్ నిర్మాణ సంస్థ అయిన మల్లెమాల వారు వద్దంటారా అంటూ ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది.మల్లె మాల వారు వద్దు అనకపోవచ్చు.
కాని నాగబాబు వెళ్లే ఉద్దేశ్యంతో మాత్రం లేడు అంటూ ప్రచారం జరుగుతోంది.ఆయన స్థానంలో ఇప్పటికే మనో గారు సెటిల్ అయ్యి ఉన్నారు.
ఆయన వెళ్లి పోవాలనుకుంటే తప్ప నాగబాబుకు ఛాన్స్ ఉండదు.కనుక నాగబాబు ఆయన్ను తప్పించి వెళ్లాలని అనుకోడు.
కనుక మళ్లీ జబర్దస్త్ లో నాగబాబు ఎంట్రీ అనేది జరిగే అవకాశం లేదని ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అంటున్నారు.