ప్రభాస్, కృతి సనన్ హీరో హీరోయిన్ లుగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్( Director Om Raut ) దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”ఆదిపురుష్”.( Adipurush ) ఈ పీరియాడిక్ వండర్ ను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేసారు.
ఇప్పటికే ఎన్నో వివాదాలను, విమర్శలను ఎదుర్కున్న ఈ సినిమా తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది.తాజాగా ట్రైలర్ లో ఓం రౌత్ మరో మిస్టేక్ చేసాడని అంటున్నారు.
హనుమంతుడిని బాగా నమ్మే రాముడు సీతమ్మను వెతికే పని అప్పజెప్పి.ఆమె కనిపిస్తే రాముడు దూత అని తెలియజేసే విధంగా తన ఉంగరాన్ని హనుమంతుడికి ఇస్తాడు.హనుమంతుడి( Lord Hanuman ) లంకకు చేరుకొని సీతమ్మను గుర్తించి రాముడి క్షేమాన్ని తెలియజేసే ఉంగరం సీతమ్మ చేతికి సీహి అలాగే రాముడుకి ఇవ్వడానికి సీతమ్మ తన చూడామణి తీసి హనుమంతుడికి ఇస్తే రాముడుకు దానిని చేరవేస్తాడు.ఇదంతా మనం ఇప్పటి వరకు రామాయణ కథలలో చూసాం.
విన్నాం.
అయితే ఈ సన్నివేశాన్ని ఇప్పుడు ఆదిపురుష్ లో ఓం రౌత్ మార్చేసి చూపించాడు.చూడామణి ( Chudamani )బదులుగా సీతమ్మ ఇందులో తన గాజును హనుమంతుడికి ఇచ్చింది.ఇది ట్రైలర్ లో స్పష్టంగా చూపించారు.
రాముడికి తన ఆనవాలుగా గాజును ఇచ్చినట్టు ఏ రామాయణంలో ఉంది అనే అనుమానం ఇప్పుడు అందరిలో కలుగుతుంది.
ఓం రౌత్ ఏ ఆధారాలతో చూడామణి బదులుగా గాజును చూపించారు అని కొంతమంది ఫైర్ అవుతున్నారు.మరి ఈ సన్నివేశం చుసిన తర్వాత రామాయణం లోని ఇంకెన్ని విషయాలను వక్రీకరించారు అని ఫ్యాన్స్ సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ సినిమా రిలీజ్ అయితే కానీ అసలు విషయం బయటకు రాదు.
జూన్ 16న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.