ప్రస్తుత సాంకేతిక యుగంలో మానవ సంబంధాలు అనేవి పూర్తిగా క్షీణించిన పరిస్థితి ఉంది.ఎందుకంటే మొబైల్ ఫోన్ ప్రపంచాన్ని శాసిస్తోంది.
మొబైల్ ఫోన్ ను వదలకుండా, సామాజిక మాధ్యమాలలో కాలం గడపకుండా ఎవరూ ఉండటం లేరనేది అందరం అంగీకరించాల్సిన విషయం.ఎందుకంటే ప్రస్తుత మానవ జీవితం దీనితో ముడిపడి ఉంది.
కావున మనకు నిత్యజీవితానికి ఎంతో అవసరమైన సాంకేతికను విడిచి బ్రతకలేకపోతున్నాం.అయితే ఈ సమయంలో సోషల్ మీడియాలోనూ, ఫోన్ లో గడపకుండా కొద్ది రోజులు ఉండగలమా అంటే ఖచ్చితంగా ఇది అసంభవం అనే మాట మనకు వినబడుతుంది.
ఇక అసలు విషయంలోకి వెళ్తే డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ భార్య, నటి హాజెల్ కీచ్ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.అయితే హాజెల్ కీచ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు బాలీవుడ్ ని షాక్ కు గురవడమే కాదు.
ప్రతి ఒక్కరిని కూడా షాక్ కు గురిచేసింది.కొద్ది రోజుల పాటు సోషల్ మీడియా నుండి దూరంగా ఉండాలనుకుంటున్నట్టు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపింది.
అయితే తనను సంప్రదించాలనుకునే వారు ఫోన్ లో సంప్రదించవచ్చని తెలిపింది.అయితే ఇప్పుడు ఈ నిర్ణయంపై నెట్టింట్లో జోకులు పేలుతున్నాయి.
ఈ కాలంలో ఇటువంటి నిర్ణయమా అని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతుండగా, మంచి నిర్ణయం తీసుకుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ఏది ఏమైనా నటి హాజెల్ కీచ్ తీసుకున్న ఈ నిర్ణయం ఒక్కసారిగా నెట్టింటిని ఒక్క ఊపు ఊపిందని చెప్పవచ్చు.