నేను బీహార్కు బయటి వ్యక్తిని అయితే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి బయటి వ్యక్తి కాదా? … ఇదీ ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ ఎన్నికల ప్రచారంలో వేసిన ప్రశ్న.ఆ రాష్ట్రంలో అయిదు దశల పోలింగులో మూడు దశలు ముగిశాయి.
ఇంకా రెండు దశలు మిగిలి ఉన్నాయి.అందు కోసం సాగుతున్న ప్రచారంలో ప్రధాని మోడీ ప్రసంగించారు.
నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, సోనియా గాంధీతో కూడిన గ్రాండ్ అలయన్సు నరేంద్ర మోడీని బీహారీ కాదు బహారీ (బయట) వ్యక్తీ అని ప్రచారం చేస్తున్నది.రాష్ట్రాన్ని బిహారీ పరిపాలించాలి.
కాని బయట వ్యక్తీ (ఎన్డీయే) పరిపాలించకూడదు అని గ్రాండ్ అలయన్స్ ప్రచారం చేస్తోంది.దీనిపై మోడీ మాట్లాడుతూ తనను బయటి నాయకుడిగా ప్రచారం చేస్తున్నారని, మరి సోనియా గాంధి బీహారియా? అని ప్రశ్నించారు.సోనియా విదేశీ మహిళా అనే అర్థంలో కూడా మాట్లాడారు.బీహార్ ఎన్నికలలో మోడీ అలుపు ఎరగకుండా ప్రచారం చేస్తున్నారు.ప్రచార భారమంతా ఆయనే మోస్తున్నారు.ఈ ఎన్న్జికల్లో గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్నారు.