హుజూరాబాద్ ఉప ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు నేటితో కొంత తెరపడే ఆవకాశం ఉంది.అయితే వాతావరణం మొత్తం ఈటెల, టీఆర్ఎస్ చుట్టూ తిరుగుతున్నా కెసీఆర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ గెలవాలని కృత నిశ్చయంతో ఉన్న పరిస్థితి ఉంది.
అందుకు తగ్గట్టుగానే హరీశ్ రావు కెసీఆర్ వ్యూహాలను క్షేత్ర స్థాయిలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రయోగించిన పరిస్థితి ఉంది.అయితే ఈ వ్యూహాలు ఎంత మేరకు సఫలమయ్యాయనేది నవంబర్ రెండవ తారీఖు న పూర్తి స్థాయి క్లారిటీ రానుంది.
అయితే ఈ ఉప ఎన్నిక కెసీఆర్ కు చాలా ప్రతిష్టాత్మకం కావడంతో దృష్టి మొత్తం దీనిపైనే ఉంచిన పరిస్థితి ఉంది.
ఇక ఈ ఎన్నికలో టీఆర్ఎస్ గెలిస్తే ఇక ఇదే దూకుడును మరింత పెంచి ప్రతిపక్షాలకు అందనంత దూరంలో టీఆర్ఎస్ ను నిలిపే అవకాశం ఉంది.
ఎందుకంటే ప్రతి ఎన్నికలో విజయంతో ఇతర పార్టీలకు సమాధానం ఇచ్చే ట్రెండ్ ను కొనసాగిస్తున్న ఈ ఎన్నిక విజయంతో ఇక పూర్తి స్థాయి రాజకీయ పార్టీ ఎలాగైతే వ్యవహరిస్తుందో అచ్చం అదే రీతిలో దూకుడుగా వెళ్ళే అవకాశం ఉంది.ఇక అప్పుడు అధికార, ప్రతిపక్షాల అసలు రాజకీయ యుద్దం మొదలయ్యే అవకాశం వందకు వంద శాతం ఉంది.
అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీలుగా బీజేపీ, కాంగ్రెస్ లు పోటీ పడుతున్న పరిస్థితి ఉంది.అయితే కెసీఆర్ మాత్రం చాలా స్పష్టమైన వ్యూహంతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.
అందుకే ప్రతిపక్షాల దూకుడును ఏ మాత్రం సీరియస్ గా తీసుకోవడం లేదు.ఇక రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలుంటాయనే దానిపై కెసీఆర్ కు ఒక స్పష్టమైన అవగాహన కారణంగా భవిష్యత్తులో సంచలమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.