ఒక సినిమా అంటే అందులో హీరో ఎంత ముఖ్యమో హీరోయిన్ అంతే ముఖ్యం.అలా సినిమాలో హీరోయిన్ కానీ హీరో కానీ లేకపోతే ఆ సినిమాకు అర్థం అనేది ఉండదు.
అందుకే సినిమా ఎండింగ్ వరకు హీరో హీరోయిన్ ఉండేలా చేస్తారు.అలా సినిమాలో హీరో హీరోయిన్ తోనే మెప్పించే ఫినిషింగ్ టచ్ ఉంటేనే ప్రేక్షకులు సినిమా చూసినట్లు తృప్తి పొందుతారు.
లేదంటే నిరాశ చెందుతారు.కొన్ని సినిమాల్లో మాత్రం హీరోయిన్ లేదా హీరో మధ్యలోనే చనిపోయే సందర్భాలు కూడా ఉంటాయి.దీంతో సినిమా అనేది అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోదు.అలా హీరో మధ్యలో చనిపోతే వెంటనే హీరోని మళ్లీ పుట్టించడం వంటివి కొత్త కొత్తగా క్రియేట్ చేస్తుంటారు.
అలా సినిమాకి ఫినిషింగ్ టచ్ ఉండేలా చేస్తారు.
ఇదంతా ఎందుకు చెబుతున్నారు అని అనుకుంటున్నారా.
తాజాగా మీమర్స్ ఒక కొత్త లాజిక్ ను కనిపెట్టారు.అదేంటంటే సినిమాలో మధ్యలో హీరో చనిపోతే అది దేవుడి ప్రసాదం వల్ల అని లాజిక్ ను కనిపెట్టారు.
అవును అది కూడా హీరో నాని సినిమాలోనే.గతంలో నాని నటించిన ఈగ సినిమా అందరికీ గుర్తే ఉండొచ్చు.
గ్రాఫిక్ నేపథ్యంలో ఈ సినిమా విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇక ఈ సినిమాలో నాని సరసన సమంత హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.ఇక ఇందులో నాని కొద్దిసేపు మాత్రమే కనిపిస్తాడు.మిగతా మొత్తం ఒక చిన్న జీవి ఈగ రూపంలో కనిపిస్తాడు.
ఇందులో నాని తాను బ్రతికున్నప్పుడు సమంతను ఇష్టపడతాడు.
ఇక ఆమె వెంటనే తిరిగేవాడు.అలా ఓసారి సమంత నాని కి గుడిలో ప్రసాదం పెడుతుంది.దాంతో ఆ సినిమాలో ఆ హీరోయిన్ హీరోకి దేవుడి ప్రసాదం పెట్టడం వల్లే హీరో చనిపోయాడని క్రియేట్ చేశారు మీమర్స్.
అంతేకాకుండా ఇటీవలే విడుదలైన శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా ఇలాగే జరిగింది అంటూ మీమర్స్ లాజిక్ ను బయటికి తీశారు.
అందులో కూడా నాని కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే.ఈయన సరసన కృతి శెట్టి, సాయి పల్లవి హీరోయిన్ లుగా నటించారు.ఇక ఇందులో కూడా హీరో కు హీరోయిన్ ప్రసాదం పెట్టడం వల్లే హీరో చనిపోయాడని క్రియేట్ చేశారు.
దీంతో దీనిని సోషల్ మీడియాలో ఫన్నీగా క్రియేట్ చేశారు మీమర్స్.
నాని ఫోటోను పెట్టి.
ప్రసాదం పెట్టి పైకి పంపిస్తున్నారు అమ్మ అని ఎడిట్ చేశారు.ఇక ఆ పోస్ట్ కు.వాళ్లు చంపిన నువ్వు జిడ్డులాగా పుడుతున్నావ్ కదా అని దారుణంగా కామెంట్ పెట్టగా.ప్రస్తుతం ఈ మీమ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.
ఇక నెటిజన్లు కూడా రకరకాల కామెంట్లు పెడుతున్నారు.ఇలా కూడా లాజిక్ ను క్రియేట్ చేస్తున్నారా అని అంటున్నారు.