దేశంలో కరోనా సెకండ్ వేవ్ మహా భయంకరంగా విజృంభిస్తోంది.వైరస్ తన ఆకారాన్ని రోజు రోజుకి మార్చుకుంటూ .
భారీగా వ్యాప్తి చెందుతూ ఉంది.దీంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరు కూడా తప్పించుకోలేని పరిస్థితి.
ఇప్పటికే దేశంలో చాలా మంది సెలబ్రిటీలు మరియు రాజకీయ నేతలు కూడా కరోనా బారినపడి హాస్పిటల్లో జాయిన్ అవుతూ కొంతమంది ప్రాణాలు విడిచే పరిస్థితి నెలకొంది.ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కరోనా బారిన పడ్డారు.
స్వల్ప లక్షణాలు ఉండటంతో వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
దీంతో వైద్యుల సూచన మేరకు హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.బన్నీ కి పాజిటివ్ అని తెలియటంతో అభిమానులు సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే గత కొద్ది రోజుల క్రితం బన్నీ తండ్రి అల్లు అరవింద్ కూడా కరోనా బారిన పడటం జరిగింది.అయితే ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ కి పాజిటివ్ రావటంతో.
మెగా కుటుంబంలో టెన్షన్ నెలకొంది.