టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం పుష్ప.పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది.
ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పాటలకు, పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగానే స్పందన వినిపిస్తోంది.అంతేకాకుండా ఇటీవలే రిలీజ్ అయిన శ్రీవల్లి సాంగ్ కూడా ట్రెండింగ్ గా మారింది.
చాలా కాలం తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం పుష్ప ది రైజ్ ను డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో దాదాపుగా మూడు పాటల చిత్రీకరణ మాత్రం పూర్తి చేయాల్సి ఉంది.ఇక ఈ మూడు పాటల షూటింగ్ ను విదేశాల్లో ప్లాన్ చేశారట డైరెక్టర్ సుకుమార్.
ఇక పాన్ ఇండియా మూవీ కావడంతో అందుకు తగ్గట్టుగానే ప్రమోషన్స్ ప్లాన్ చేసుకోవాలి మరి.
చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో పుష్ప మూవీ తెరకెక్కుతోంది.ఇందులో విలన్ గా మలయాళం స్టార్ ఫహాద్ ఫాజీల్ నటిస్తున్నాడు.ఇందులో బండి పుష్ప రాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.