డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప‘.భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఈయన సరసన ఇండియన్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా అక్రమంగా రవాణా చేస్తున్న గంధపు చెక్కల నేపథ్యంలో రూపొందుతుంది.
ఇదిలా ఉంటే ఓ సమస్యతో కొన్ని రోజులు వాయిదా పడ్డ ఈ సినిమా తిరిగి మళ్లీ షూటింగ్ లో బిజీ గా ఉంది.
గతంలో ఈ సినిమా షూటింగ్ కోవిడ్ కారణంగా వాయిదా పడగా అదే సమయంలో డైరెక్టర్ సుకుమార్ తన అనారోగ్య సమస్యతో బాధ పడటంతో ఈ సినిమా షూటింగ్ మళ్ళీ కొన్ని రోజులు వాయిదా పడింది.
ఇక తాజాగా సుకుమార్ తన అనారోగ్య సమస్య కోలుకోవడంతో తిరిగి షూటింగ్ మొదలు పెట్టినట్లు తెలుస్తుంది.ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.
ఇక అల్లు అర్జున్ తో కొన్ని సీన్స్ కూడా చేస్తున్నారు.ఇక ఈ సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయడానికి గట్టి నిర్ణయం తీసుకున్నారు దర్శక నిర్మాతలు.
ఈ సినిమాను రెండు భాగాలుగా చేసిన సంగతి తెలిసిందే.ఇందులో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు.ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ సినిమాలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.అంతేకాకుండా యాంకర్ అనసూయ, కమెడియన్ సునీల్ కూడా విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది.మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక ఇందులో దేవిశ్రీప్రసాద్ తన సంగీతాన్ని వినిపిస్తున్నాడు.ఈ సినిమా కోసం బన్నీ అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు.
ఇది వరకే సుకుమార్, బన్నీ కాంబినేషన్ లో ఆర్య, ఆర్య 2 ప్రేక్షకుల ముందుకి రాగా.మరోసారి వీరి కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమా ఎటువంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి.