ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప సినిమా రెండు పార్టులుగా రిలీజ్ కాబోతుంది.పుష్ప పార్ట్ 1 డిసెంబర్ 17న రిలీజ్ ఫిక్స్ చేశారు.
కరోనా టైం లో అడవుల్లో ఈ సినిమా కోసం కాస్ట్ అండ్ క్రూ చాలా కష్టపడ్డదని తెలుస్తుంది.అందుకే బన్నీ సినిమా పార్ట్ 1 పూర్తి అయ్యాక చిత్రయూనిట్ అందరికి బంగారపు ఉంగరాలు గిఫ్టులుగా ఇచ్చాడట.
తులం బంగారపు ఉంగరాలను పుష్ప టీం అందరికి అల్లు అర్జున్ కానుకగా ఇచ్చినట్టు తెలుస్తుంది.
మాములుగా అయితే ఈ సంప్రదాయం తమిళ పరిశ్రమలో కొనసాగుతుంది.
అక్కడ స్టార్ హీరోలు సినిమా పూర్తయ్యాక చిత్రయూనిట్ అందరికి ఫోన్లు గిఫ్ట్ గా ఇవ్వడం, గోల్డ్ చైన్లు గిఫ్ట్ గా ఇవ్వడం.రింగులు గిఫ్టులుగా ఇవ్వడం జరుగుతుంది.
ఈ క్రమంలో అల్లు అర్జున్ కూడా వారి బాటలోనే పుష్ప టీం అందరికి బంగారపు ఉంగరాలు ఇచ్చాడని తెలుస్తుంది.సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న పుష్ప సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు. బన్నీ కెరియర్ లో ఫస్ట్ టైం పాన్ ఇండియా రేంజ్ లో పుష్ప రిలీజ్ చేస్తున్నారు.
మరి పుష్పతో అల్లు అర్జున్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.