ఇండియా తో మ్యాచ్...పాక్ కు జరిమానా!!

ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో ఇంకా పాక్.భారత్ ఎదురుపడకుండానే పాక్ టీమ్ సభ్యులు జరిమానాకు గురయ్యారు…వివరాల్ళోకి వెళితే…స్నేహితులతో కలిసి డిన్నర్‌కు వెళ్లిన అఫ్రిదీ, ఓపెనర్ అహ్మద్ షెజాద్, మరో ఆరుగురు క్రికెటర్లు నిర్ణీత సమయానికి తిరిగి హోటల్‌కు రాలేదు.

 Pak Players Fine Due To Misbehave-TeluguStop.com

అయితే వారంతా ఇక్కడి నైట్ క్లబ్‌కు వెళ్లినట్లు సమాచారం.అంతే కాదు… పాకిస్ధాన్ ఆటగాడు షహజాద్ అయితే మరో అడుగు ముందుకేసి బాక్సర్‌తో అతను గొడవకు దిగినట్లు సమాచారం.

పరిస్థితి అదుపు గొడవపడే వరకు వచ్చింది.చివరకు షహజాద్ క్షమాపణలు చెప్పడంతో వారంతా నైట్ క్లబ్ నుంచి బయటకు వచ్చారు.

దీనిపై జట్టు మేనేజర్ నవీద్ చీమా పాక్ బోర్డుకు ఫిర్యాదు చేశాడు.దాంతో పీసీబీ ఒక్కో ఆటగాడికి 230 డాలర్లు (దాదాపు రూ.15 వేలు) జరిమానా విధించింది.అనంతరం ఆటగాళ్లు క్షమాపణ చెప్పారు.

మరో సారి ఇలాంటి ఘటన పునరావృతమైతే, తక్షణమే టోర్నమెంట్ నుంచి బహిష్కరిస్తామని జట్టు మేనేజ్‌మెంట్ హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube