పొట్ట కూటి కోసం ఎంతో మంది భారత్ వదిలి విదేశాలకు వలసలు వెళ్తూ ఉంటారు.అయితే అలా వెళ్ళిన వారిలో రోజు వారి కూలి పనులు చేసుకునే పేద, మధ్య తరగతి కుటుంభాలు ఎక్కువగా ఉంటాయి.
అలా వెళ్ళిన వారిలో ఎవరైనా చనిపోతే అతడిపై ఆధారపడిన కుటుంభ సభ్యుల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది.ఆర్ధికంగా వారికి ఇంటి పెద్ద మరణం తీరని లోటు.
ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఖతర్ లోని భారత ఎంబసీ, ఐసిబీ ఎఫ్ లు కలిసి ప్రవాసి భీమాను అందుబాటులోకి తీసుకువచ్చారు.ఈ భీమా చనిపోయిన ప్రవాసి యొక్క కుటుంభానికి ఆర్దిక సాహం చేస్తుందని అన్నారు.
వివరాలలోకి వెళ్తే.
ఖతర్ లో పనిచేస్తున్న ప్రవాస భారతీయుల సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడిన ఐసీబిఎఫ్ జీవిత భీమ పధకంను ప్రవేశపెట్టంది.
ఈ పధకం క్రిందకు కతర్ లో పనిచేస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన వారందరికి ప్రయోజనం ఉంటుంది.దాంతో తెలుగు ప్రవాసీయులను ఈ పధకం కిందకు చేర్చడానికి రెండు రాష్ట్రాలకు చెందిన ప్రవాస సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
అంతేకాదు ఈ పధకానికి చేయూత నిచ్చే విధంగా పలువురు కార్మికుల తరుపున ప్రీమియం కూడా ముందుగానే చెల్లించుతున్నారు.ఈ పధకం వలన ఉపయోగాలు ఎలా ఉంటాయంటే.
ఈ పాలసీ తీసుకున్న ఎన్నారై ఎవరైనా పాలసీ గడువులోపు మృతి చెందింతే రూ.20 లక్షలు పాలసీ దారుడు కుటుంభానికి చెల్లిస్తారు.ఈ పాలసీ వ్యవధి రెండేళ్ళు.ఈ పాలసీ చేరడానికి అయ్యే ఖర్చు 125 రియాళ్ళు.ఒక వేళ పాలసీ దారుడు ప్రమాదంలో గాయపడి అంగవైకల్యం తో నడవలేని స్థితిలో ఉంటే ఆయా పరిస్థితులను బట్టి డబ్బు అందజేస్తారు.ఈ పాలసీకు అర్హులుగా 18 నుంచి 65 ఏళ్ళ వయసు ఉండి,కతర్ వీసా కలిగి ఉండాలని తెలిపారు.
మరింత సమాచారం కోసం సెల్ -0097477867794, 0097450977090 నెంబర్ల ను సంప్రదించవచ్చునని తెలిపారు.
.