పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకం.అందుకే అందరూ ఈ జ్ఞాపకం జీవితాంతం గుర్తుండిపోయే విధంగా లక్షలు ఖర్చు పెట్టి గొప్పగా చేసుకుంటున్నారు.
ఈ మధ్య కాలంలో ఈ పెళ్లి వేడుకల కోసం కోట్లలో ఖర్చు పెట్టె వారు కూడా ఉన్నారు.అయితే కొంత మంది మాత్రం ఈ కార్పోరేట్ యుగంలో ఉరుకుల పరుగుల జీవితంలో టైంకి ఇచ్చే విలువ జీవితంలో మరి వేటికి ఇవ్వరు.
ప్రతి నిమశాన్ని వేల్యూ కడతారు.ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి నిబద్ధతతో పని చేసేవారు అయితే కుటుంబం కంటే ఎక్కువ ప్రాధాన్యత పనికి ఇస్తారు.
ఇప్పుడు ఓ యువజంట టైం లేక తాము పని చేస్తున్న ప్రభుత్వ ఆఫీస్ లోనే చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు.ఇప్పుడు ఈ ఘటన అక్కడ హాట్ టాపిక్ గా మారింది.
పంజాబ్ కు చెందిన తుషార్ సింగ్లా ఐఏఎస్ కు ఎంపికయ్యాడు.ప్రస్తుతం ఉలుబేరియాలో ఎస్డిఓగా పనిచేస్తున్నాడు.ఇక వధువు నవజోత్ సిమి బీహార్ కేడర్ ఐపిఎస్ అధికారి.నవజోత్ సిమి తుషార్ సింగ్లా కొన్ని రోజుల క్రితం నుంచి ప్రేమించుకుంటున్నారు.2021లో పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల వల్ల తుషార్ సింగ్లా బిజీ అయ్యాడు.దీంతో చాలా సార్లు పెళ్లి వాయిదా పడింది.
దీంతో ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు.పాట్నాలో నవజోత్ సిమి నిన్న లవర్స్ డే రోజున కోల్ కతాలోని తుషార్ ఆఫీస్ కు వెళ్లారు.
అక్కడ రిజిస్ట్రార్ ను పిలిచి సంతకాలు చేశారు.ఇద్దరు పెళ్లి బట్టలు ధరించారు.
కుటుంబ సభ్యులు, ఆఫీస్ సిబ్బంది సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.తర్వాత ఆఫీస్ బయట ఫోటోలకు పోజులిచ్చారు.
పని ఎక్కువగా ఉండటం వలనే ఇలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని మీడియాకి తెలియజేశారు.కాస్తా పనులన్నీ అయ్యాక రిసెప్షన్ గ్రాండ్ గా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
ఈ పెళ్లి తంతు చూసిన తర్వాత ఒకరిమీద ఒకరికి ప్రేమ ఉండాలి కాని ఎక్కడ పెళ్లి చేసుకుంటే ఏముంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.