భారత్ గతంలో చేసిన సర్జికల్ స్ట్రైక్ తరహాలో ఈ సారి ఊహించని విధంగా ఎయిర్ స్ట్రైక్ తో పాకిస్తాన్ కి షాక్ ఇచ్చింది.పాకిస్తాన్ ఆర్మీ మొత్తం సరిహద్దులో మొహరించి యుద్ధానికి సిద్ధం అవుతున్న టైంలో ఊహించని విధంగా భారత్ ఆర్మీ ఐఏఎఫ్ తో ఎయిర్ స్ట్రైక్ తో దెబ్బ కొట్టింది.
ఎయిర్ స్ట్రైక్ తో జైషే మహ్మద్ స్థావరాలపై దాడులు చేసిన భారత రక్షణ శాఖ అక్కడి స్థావరాలని పూర్తిగా ద్వసం చేసినట్లు ప్రకటించింది.
ఇక ఈ ఎయిర్ స్ట్రైక్ లో మూడు వందల మంది ఉగ్రవాదులు మరణించి ఉంటారని రక్షణ శాఖ ప్రకటించింది.
ఈ రోజు ఉదయం మూడు గంటల సమయంలో 12 ఐఎఎఫ్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ లోకి వెళ్లి అక్కడి స్థావరాలని లక్ష్యంగా చేసుకొని వెయ్యి కేజీల బాంబులని ఉగ్ర శిబిరాలపై వేసి దాడులు చేసాయి.పాకిస్తాన్ ఆర్మీ, ప్రభుత్వం ఈ దాడిని ఎ మాత్రం ఊహించలేదని చెప్పాలి.
అయితే ఈ దాడి విషయాన్ని దృవీకరించిన పాకిస్తాన్ ఎవరు చనిపోలేదనే చెప్పుకొచ్చింది.అలాగే నిబంధనలకై విరుద్ధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సరిహద్దు దాటిందని ఆరోపణలు చేసింది.
ఈ ఎయిర్ స్ట్రైక్ పై భారత్ యావత్తు ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తుంది.