కియారా అద్వానీ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.ఈమె నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికి,తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకుంది.
ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది.ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ సినిమాలతో బిజీగా గడుపుతోంది.
ఇక ఈ భామకు ఉన్న ఫాలోయింగ్ గురించి క్రేజ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటికే ఈమె రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమాతో పాటుగా టాలీవుడ్లోనూ అలాగే బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటిస్తోంది ఈ బ్యూటీ.
అయితే ఇటీవలే సందీప్ రెడ్డి వంగానే దర్శకత్వంలో షాహిద్ కపూర్ తో కలిసి కబీర్ సింగ్ అనే సినిమాలో నటించిన విషయం అందరికి తెలిసిందే.
ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ అయినా అర్జున్ రెడ్డి సినిమాకు రీమేక్ గా వచ్చింది.తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ఈ సినిమా హిందీలో కూడా అదే రేంజ్ లో సక్సెస్ ను సాధించింది.
ఇది మరొక సారి అలాంటి సినిమా లో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అని చెబుతోంది కియారా అద్వానీ.
అలాంటి స్క్రిప్టులో నటించే అవకాశం గనుక వస్తే.అలాంటి వాటిని అస్సలు మిస్ చేసుకోకూడదు అని ఆమె తెలిపింది.ఆమె కెరీర్లో ఉత్తమ సినిమాగా కబీర్ సింగ్ సినిమా చెప్పుకుంటుందట.
అలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయి.అలాగే షాహిద్ కపూర్ లాంటి నటుడితో నటించడం కూడా గొప్ప అనుభవాన్ని ఇచ్చింది.
అంతేకాకుండా ఈ సినిమా నన్ను ప్రేక్షకులకు భగత్ దగ్గర చేసింది అని చెప్పుకొచ్చింది.ప్రేక్షకులు ఆశిస్తున్నట్లు గా మళ్లీ షాహిద్ తో కలిసి నటించే అవకాశం వస్తే అసలు వదులుకోను అని కియరా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.