బీఎస్ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.ఎందుకంటే ఆయన గతంలో ఆర్మీ కి నాసిరకం భోజనం సరఫరా చేస్తున్నారు అంటూ సోషల్ మీడియా లో వీడియో పోస్ట్ చేయడం తో ఆయనను బీఎస్ఎఫ్ నుంచి వెనక్కి పంపించేశారు కూడా.
అయితే ఇటీవల వారణాసి లో ప్రధాని నరేంద్ర మోడీ పై పోటీ చేయడం కోసం ఎస్పీ,బీఎస్పీ,ఆర్ఎల్డీ ఉమ్మడి అభ్యర్థిగా యాదవ్ నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా వాటిని ఎన్నికల అధికారి మే 1 న తిరస్కరించిన సంగతి తెలిసిందే.దీనితో ఆయన ఇప్పుడు సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు.
అయితే ఇప్పుడు మాట్లాడేది ఆ విషయం గురించి కాదు.తేజ్ బహదూర్ కు సంబందించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఆయనకు సంబందించిన రెండేళ్ల కిందట వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.జాతీయ చానెళ్లలో ప్రసారమైన ఈ వీడియోలో తేజ్ బహదూర్ ఓ స్నేహితుడితో మాట్లాడుతూ.రూ.50 కోట్లు ఇస్తే మోదీని చంపేస్తానని వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది.అయితే దానికి ఆ స్నేహితుడు పాకిస్థాన్ ఇస్తుందని బదులివ్వగా.తాను దేశభక్తుడినని, పాక్ సాయం తీసుకోబోనంటూ వ్యాఖ్యాయించారు.
భారతీయుడు డబ్బు ఇస్తే.ఈ పని చేస్తానని అతను చెప్పుకొచ్చినట్టు ఈ వీడియోలో జరిగిన సంభాషణ ప్రకారం స్పష్టం గా ఉంది.
అయితే ఈ వీడియో ఎంతవరకు ప్రామాణికమైనదనే అంశం ఇంకా తేలలేదు.మరోపక్క ఈ వీడియోపై బీజేపీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది.ఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఓ వ్యక్తి రూ.50 కోట్లతో ప్రధాని మోదీ హత్యకు కుట్ర చేయడం షాకింగ్ గా ఉందని, దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాలంటూ బీజేపీ ఎంపీలు అంటున్నారు.అయితే ఇదంతా ఫేక్ అని మార్ఫింగ్ ద్వారా ఈ వీడియో చేశారంటూ బహదూర్ ఆరోపిస్తున్నారు
.