ప్రస్తుతం టాలీవుడ్ లో కన్నడ బ్యూటీ రష్మిక మందన వరుస హిట్లతో దూసుకుపోతోంది.తాజాగా రష్మిక మందన్న దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వం వహించినటువంటి భీష్మ అనే చిత్రంలో నటించింది.
ఈ చిత్రంలో హీరోగా నితిన్ నటించాడు.అలాగే ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్, కేజిఎఫ్ ఫేమ్ అనంతనాగ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.
ఈ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.అయితే తాజాగా రష్మిక ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఇందులో భాగంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి నటువంటి కొన్ని విషయాలను తెలుగు ప్రేక్షకులతో పంచుకున్నారు.
అయితే ఇందులో ఒకవేళ తాను హీరోయిన్ గా రాణించలేకపోయి ఉంటే ఫిట్నెస్ సంబంధిత వ్యాపారాన్ని చేసేదాన్ని అని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.
అంతేగాక తనకు హైదరాబాద్ నగరంలోనే సెటిల్ కావాలని ఉందని అయితే మరో రెండు చిత్రాల్లో నటించిన అనంతరం హైదరాబాద్ నగరంలో తనకంటూ సొంత ఇల్లుని కొనుక్కుంటానని తెలిపింది రష్మిక.అలాగే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చార్మినార్ అంటే తనకు చాలా ఇష్టమని రాత్రి సమయంలో బుర్కా వేసుకుని ఖచ్చితంగా చూడడానికి వెళ్తానని అన్నారు.
తను తాజాగా నటించిన టువంటి భీష్మ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని అందరూ థియేటర్లకు వెళ్లి చూడాలని ప్రేక్షకులను కోరింది.
అయితే గత కొద్ది కాలంగా వరుస స్టార్ హీరోల చిత్రాలతో బిజీగా బిజీబిజీగా కలిగినటువంటి ఈ అమ్మడు ఇప్పుడు కొంతమేర విశ్రాంతి తీసుకున్నట్లు తెలుస్తోంది.అంతేగాక కొంతకాలం విశ్రాంతి అనంతరం పొగరు అనే కన్నడ చిత్రంలో నటించనుంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు నందకిషోర్ దర్శకత్వం వహిస్తున్నాడు.