సినీ సెలబ్రిటీస్ కు సంబందించిన వార్తలపై ఏదైనా న్యూస్ వస్తే అది నిజమా కాదా అన్నది తెలుసుకోకుండా వైరల్ అవుతుంది.ఒకరు కవర్ చేసిన ఆ న్యూస్ ను అన్ని మీడియా సంస్థలు కవర్ చేస్తారు.
కనీసం అది నిజమా కాదా అన్నది తెలుసుకోరు.లేటెస్ట్ గా వకీల్ సాబ్ హీరోయిన్ అంజలికి సంబందించిన న్యూస్ ఒకటి వైరల్ గా మారింది.
తనకు కరోనా వచ్చిందని మీడియాలో హడావిడి చేస్తున్నారు.కాని నాకు కరోనా పాజిటివ్ రాలేదు.
నేను ఆరోగ్యంగానే ఉన్నానని అంటుందు అంజలి.
సెలబ్రిటీస్ కు కరోనా అనే వార్త కనబడగానే వివరాలు ఏమి చూడకుండా రాసేయడం అలవాటుగా మారింది.అంజలికి కరోనా అనగానే అందరు షాక్ అయ్యారు.వకీల్ సాబ్ రిలీజ్ కు ఒకరోజు ముందు ఆ సినిమాలో నటించిన అంజలికి కరోనా అంటూ వార్తలు రాశారు.
కాని అసలు విషయం ఏంటన్నది అంజలి క్లియర్ చేసింది.తాను అబ్జల్యూట్లీ ఫైన్ అని ట్విట్టర్ లో మెసేజ్ పెట్టింది.వకీల్ సాబ్ రిలీ కు ముందు అమ్మడికి ఈ నెగటివ్ న్యూస్ కొద్దిగా డిస్టబ్ చేసినా పవన్ సినిమాలో ఓ చిన్న భాగం అయినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని అంటుంది అంజలి.
.