ప్రస్తుతం ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా మంచి వేదికగా మారింది.ముఖ్యంగా నటీనటులు కావడానికి మాత్రం సోషల్ మీడియా ఒక మంచి ఫ్లాట్ ఫామ్ అని చెప్పాలి.
ఈ సోషల్ మీడియా ద్వారా తమలో ఉన్న టాలెంట్ ను బయటపెట్టి బుల్లి తెర పై, వెండితెరపై అడుగు పెడుతున్నారు.ఇప్పటికే చాలామంది యూట్యూబ్ స్టార్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకున్నారు.
అందులో షణ్ముఖ్, దీప్తి సునయన, దీపిక పిల్లి ఇలా పలువురు యూట్యూబ్ స్టార్ లు బుల్లి తెర పై, వెండితెరపై అవకాశాలు అందుకున్నారు.ఇక వీరే కాకుండా మరో సోషల్ మీడియా స్టార్ వైష్ణవి చైతన్య కూడా మంచి సెలబ్రిటి హోదాను సంపాదించుకుంది.
మొత్తానికి సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీగా మారిన వైష్ణవి చైతన్య అతి తక్కువ సమయంలో మంచి పేరు సంపాదించుకుంది.
మొదట డబ్స్మాష్ వీడియోలతో పరిచయం అయ్యింది.
ఆ తర్వాత టిక్ టాక్ వీడియోలు చేస్తూ బాగా ఆకట్టుకుంది.అలా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వైష్ణవి యూట్యూబ్ లో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లలో కూడా నటించింది.
యూట్యూబ్ లో కూడా మంచి సక్సెస్ అందుకుంది.ఇక మోడల్ గా కూడా మంచి క్రేజ్ అందుకుంది.
అంతేకాకుండా వెండితెరపై కూడా అవకాశాలు అందుకుంది.అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో సినిమాల్లో కూడా అల్లు అర్జున్ చెల్లెలిగా కూడా నటించి తన పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఈమె ఎక్కువగా సాఫ్ట్వేర్ డెవలపర్ అని వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.అందులో షణ్ముఖ్ జస్వంత్ కూడా నటించిన సంగతి తెలిసిందే.
ఇక ఈమెకు యూట్యూబ్ లో మంచి ఫాలోయింగ్ తో పాటు 400k సబ్స్క్రైబ్ కూడా ఉన్నారు.ఇంస్టాగ్రామ్ లో 700k ఫాలోవర్స్ ఉన్నారు.
వైష్ణవి ఎక్కువగా ఇంట్లో కంటే నెట్టింట్లో బాగా ఆక్టివ్ గా కనిపిస్తుంది.కేవలం వెబ్ సిరీస్ ల తోనే కాకుండా పలు మోడల్ కు సంబంధించిన ఫోటోలతో కూడా ఫోటో షూట్ అంటూ బాగా బిజీగా ఉంటుంది.
ఇక ఆ ఫోటోలను కూడా తన సోషల్ మీడియాలో బాగా షేర్ చేసుకుంటుంది.తన వ్యక్తిగత విషయాలతో పాటు తన ఫ్యామిలీ విషయాలను కూడా పంచుకుంటుంది.ఇక తన ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు కూడా పెడుతుంది.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా ఫాలోవర్స్ తో కాసేపు ముచ్చట్లు పెట్టింది.వారు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చింది.
అందులో ఓ నెటిజెన్ తను నటించిన అలా వైకుంఠపురం లో తను అంటే చాలా ఇష్టం అనటంతో.
వెంటనే వైష్ణవి థాంక్యూ అంటూ తనకు కొరియోగ్రాఫర్ విజయ్ అంటేనే ఇస్తామని తెలిపింది.అంతేకాకుండా పాలకూర పప్పు మా విజయ్ మాస్టర్ తోపు అంటూ కొటేషన్ కూడా పెట్టింది.
ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.