గోపీచంద్ రాశి ఖన్నా జంటగా, మారుతి దర్శకత్వంలో,మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో జీఏ2 పిక్చర్స్- యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం పక్కా కమర్షియల్.ఈ సినిమా జూలై 1వ తేదీ విడుదల కావడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ క్రమంలోనే వేదికపై చిరంజీవి మాట్లాడుతూ గోపీచంద్ కుటుంబంతో తనకున్న అనుబంధం గురించి బయట పెట్టారు.
చాలామంది గోపీచంద్ కుటుంబానికి నాకు మధ్య ఉన్న అనుబంధం ఏంటి అనుకుంటారు.అయితే గోపీచంద్ తండ్రి టి.కృష్ణ బీకాం ఫైనలియర్ చదువుతున్న సమయంలో అదే కాలేజీలో నేను ఇంటర్ ఫస్టియర్ చదివాను.కాలేజీలో కొత్తగా చేరిన నన్ను సీనియర్లు ఆయన దగ్గరకు తీసుకువెళ్లారు.
అయితే ఆ సమయంలో భయపడుతున్న నేను ఆయన్ని చూడగానే ఎంతో ధైర్యం వచ్చింది.ఆ సమయంలో కృష్ణ గారు మాట్లాడుతూ.
స్టూడెంట్ ఫెడరేషన్ కు నేను లీడర్ గా నిలబడతాను నీ సహకారం మాకు కావాలని అడిగారు.ఆ సమయంలో ఆయన ఒక హీరోగా కనిపించారని ఈ సందర్భంగా మెగాస్టార్ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.
అనుకోకుండా మేమిద్దరం సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చామని అయితే తనతో కలిసి నేను ఒక్క సినిమా కూడా చేయలేకపోయానని ఈ సందర్భంగా మెగాస్టార్ గోపీచంద్ తండ్రితో ఉన్న అనుబంధం తెలిపారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న టి.కృష్ణ గారు ప్రస్తుతం మన మధ్య లేకపోవడం బాధాకరం.ఇక గోపీచంద్ నటించిన చిత్రాలలో తనకు సాహసం అంటే ఎంతో ఇష్టమని మెగాస్టార్ ఈ సందర్భంగా వెల్లడించారు.ఇక పక్కా కమర్షియల్ సినిమా మంచి విజయాన్ని అందుకొని గోపీచంద్ కమర్షియల్ హీరోగా మరిన్ని విజయాలను అందుకోవాలని ఆశిస్తూ ఉన్నాను అంటూ చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ తెలిపారు.