యువనటుడు రామ్ కొంతకాలంగా హిట్స్ లేకుండా సతమతమవుతున్నాడు.దానికి కారణం స్వయంగా రామే.
చాలా కాలంగా కమర్షియల్ పంథాలో వెళుతూ, రొటీన్ సినిమాలతో జనాల్ని విసిగించేసాడు రామ్.ఈ విషయాన్ని మొన్న జరిగిన నేను శైలజా ఆడియో ఫంక్షన్లో ఒప్పుకున్నాడు కుడా.తన పాత సినిమాలకు భిన్నంగా నేను శైలజా ఉండబోతోంది అని గట్టిగా చెబుతున్నాడు రామ్.
” నేను సినిమాలో శైలజా అనే అమ్మయితోనే కాదు, ఈ చిత్ర కథతో ప్రేమలో పడ్డాను.ఇది రొటీన్ సినిమా కాదు.సరికొత్త పవనంలా ఉంటుంది.నేను హరి అనే డీజే పాత్రలో కనిపిస్తాను.ఇప్పుడున్న గడ్డం లుక్ తదుపరి సినిమా కోసం కాదు.
ఈ చిత్రంలోనే నా పాత్ర ఒక సందర్భంలో అలా గడ్డం పెంచుకోవాల్సి వస్తుంది.దర్శకుడు కిషోర్ ఈ సినిమాకి అన్ని తానై చూసుకున్నాడు.
కథ, మాటలు, స్క్రీన్ ప్లే అంతా తనదే.నాకు అతని మీద అభిమానం పెరిగింది.
ఈ సినిమా పట్ల చాలా నమ్మకంగా ఉన్నాను ” అంటూ చెప్పుకొచ్చాడు రామ్.
కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ నిర్మించింది.
కీర్తి సురేష్ కథానాయికగా నటించింది.దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన పాటలు ఇప్పుడు ఎక్కడా చూసినా వినిపిస్తున్నాయి.
జనవరి 1వ తేదిన ఈ సినిమా విడుదల కానుంది.