వెండి తెరకు ఎంతో మంది నటీ నటులను అందించిన అనుభవం దర్శకుడు తేజకు ఉంది.గతంలో ఈయన ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్నాడు.
‘చిత్రం’, ‘నువ్వు నేను’, ‘జయం’ వంటి చిత్రాలతో సూపర్ హిట్లను అందుకోవడంతో పాటు, పలువురు స్టార్స్ను కూడా అందించాడు.తాజాగా ఈయన అంతా కొత్త వారితో తెరకెక్కించిన చిత్రం ‘హోరా హోరీ’.
ఈ సినిమాలో హీరో, హీరోయిన్తో పాటు పలువురు నటీ నటులుగా కొత్తవారు పరిచయం అవుతున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్గా నటించడంపై తాజాగా దక్ష స్పందిస్తూ.
తాను తేజగారి దర్శకత్వంలో నటించినందుకు చాలా సంతోషిస్తున్నాను.సినిమా షూటింగ్ సమయంలో తేజగారు ఒక సన్నివేశంలో సరిగా నటించకపోవడంతో నన్ను కొట్టారు.
అయితే సన్నివేశ ప్రముఖ్యత దృష్ట్యా ఆయన కొట్టినా తాను ఫీల్ అవ్వలేదు.ఆ తర్వాత బాగా నటించాను అంటూ ఈమె చెప్పుకొచ్చింది.
ఆయన చేతిలో దెబ్బలు తిన్నా కూడా మంచి నటనతో ఈ సినిమాలో మిమ్ములను అరించబోతున్నందుకు సంతోషంగా ఉంది అంటూ ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.ఈనెల 11న ఈ సినిమాను విడుదల చేసేందుకు తేజ ఏర్పాట్లు చేస్తున్నాడు.
భారీ అంచనాలున్న ఈ సినిమా దక్షకు హీరోయిన్గా మంచి గుర్తింపును తెస్తుందేమో చూడాలి.