రామ్ గోపాల్ వర్మ మొదటి చిత్రం శివ సినిమాతో పరిచయమైన నటుడు జేడీ చక్రవర్తి.ఆ మూవీ మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత తెలుగు, తమిళ సినిమాల్లో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు.
మరి కొన్ని చిత్రాల్లో ప్రతి నాయకుడిగా, సహ నటుడిగా చేసి ఆల్ ఇన్ వన్ అని నిరూపించుకున్నారు జేడీ చక్రవర్తి.
క్షణం క్షణం సినిమా అప్పట్లో ఎంత విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే.
అయితే అప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ శ్రీదేవితో జరిగిన కొన్ని సంఘటనలను ఈ విధంగా చెప్పుకొచ్చారు.ఆ సినిమా షూటింగ్లో ఆమె ప్రతీరోజూ తనను కొత్తగా చూసే వారని చక్రవర్తి అన్నారు.
శ్రీదేవి గారు మనీ సినిమా చూశారని తెలిసింది.కానీ అప్పుడెప్పుడో మూడేళ్ల కింద కదా క్షణం క్షణం సినిమా ఇంకా తనకేం గుర్తుంటుంది అనుకున్నా.
ఐనా కూడా నేనెవరో ఆమెకు తెలీదు.నాకు కానీ తెలిసిన విషయమేమిటంటే.
ఆ సినిమా చూడగానే శ్రీదేవి గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చారని ఓ సందర్భంలో జె.డి.చక్రవర్తి తెలియజేశారు.
ఈ క్రమంలోనే శ్రీదేవి తన గురించి మాట్లాడుతూ.తాను ఇప్పటివరకు చూసిన ఇద్దరు బెస్ట్ యాక్టర్స్ లో ఈ అబ్బాయి ఒకరు అని.అది గుర్తొచ్చి ఆమె ముందుకెళ్ళి హలో మేడం అన్నాను.కానీ ఆమె మాత్రం ఎలాంటి రియాక్షన్ లేకుండా అలానే చూస్తున్నారని చక్రవర్తి తెలిపారు.నిజం చెప్పాలంటే అంతగా చెప్పింది కాబట్టి నేను కనబడగానే ఒక కిస్ లేదా ఒక హగ్ ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసి, మౌత్ వాష్ కూడా చేసుకొని వెళ్లానని జె డి చక్రవర్తిలో ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.
ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన జేడీ చక్రవర్తి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండటం గమనార్హం.ఇక రామ్ గోపాల్ వర్మ ఎన్నో వివాదాస్పద చిత్రాలను తెరకెక్కిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.