మా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నిన్నటి వరకు మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది.ఈ క్రమంలోనే కొందరు సీనియర్ నటీనటులు ప్రకాష్ రాజ్, మంచు ప్యానెల్ సభ్యులకు మద్దతు తెలుపుతూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.
ఇకపోతే ఈ ఎన్నికలపై సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలోనే మా ఎన్నికల గురించి మీడియాతో మాట్లాడిన కోట శ్రీనివాస్ రావు తను మంచు విష్ణుకి మద్దతు తెలుపుతున్నానని,అలాగే ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో ఉన్నటువంటి కొంతమందికి తాను మద్దతు తెలుపుతున్నాను అంటూ తెలిపారు.
అయితే ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో ఉన్నటువంటి కొందరు తనకు తెలియదని,ఈ క్రమంలోనే ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లో ఎవరో అనసూయ కొత్తగా వచ్చిందట ఆమె ఎవరండీ ఆమె గురించి నాకు తెలియదు, ఇంకా ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో ముగ్గురు నలుగురు ఎవరో ఇప్పటికీ తనకు తెలియదని ఈ సందర్భంగా కోట శ్రీనివాస్ రావు తెలిపారు.అయితే మా ఎన్నికలలో ఎవరైనా పోటీ చేయవచ్చు కానీ పోటీ చేయడానికి కనీస అర్హత ఉండాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
ప్రకాష్ రాజ్ మా అసోసియేషన్ లో ఎప్పుడైనా పని చేశారా అతనికి మా సమస్యల గురించి ఏం తెలుసని అంటూ కోట ప్రకాష్ రాజు పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక్కడ అవార్డులు కాదు ముఖ్యం,మా సభ్యుల సంక్షేమం ముఖ్యం.మా కోసం మీరు ఏం చేశారు చెప్పండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.