సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తున్న యంగ్ హీరో అడవి శేషు. క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలలో తన నటనతో ప్రేక్షకులను అలరించిన శేషు నటుడిగా మంచి గుర్తింప తెచ్చుకున్నాడు .
ప్రస్తుతం ఈయన మేజర్ సినిమాలో నటించాడు.ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
మేజర్ సినిమా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు.ఈ సినిమ జూన్ 3 వ తేదిన విడుదలకి సిద్దంగా ఉంది.
ఇదిలా ఉండగా అడవి శేష్ ఇటీవల అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న “ఆలీతో సరదాగా” అనే కార్యక్రమంలో సందడి చేశాడు.ఈ సందర్భంగా అడవి శేషు తన వ్యక్తిగత, వృత్తిపరమైన ఎన్నో ఆసక్తికర విషయాల గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.
ఈ షో ద్వార శేష్ తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలియచేశాడు.ఈ సంధర్భంగా శేష్ మాట్లాడుతూ అడివి సన్నీ చంద్రగా ఉన్న తన పేరు అడవి శేష్ గా మర్చుకోవడానికి సన్నీలియోన్ కారణంగా అని చెప్పాడు.
తన కాలేజీ డేస్ లో సన్నీలియోన్ బాగా ఫేమస్ అవ్వటంతో తన ఫ్రెండ్స్ అందరు తనని సన్నీలియోన్ అని ఏడిపించటంతో తన పేరు మార్చుకున్నానని తెలియచేశాడు.
హైదరాబాద్ లో పుట్టిన తను అమెరికాలో పెరిగానని చెప్పుకొచ్చాడు.అక్కడ భారతీయ నటులు హాలీవుడ్ సినిమాలలో చిన్న పాత్రలకే పరిమితమవుతారు.అందువల్ల అక్కడ సినిమాలలో నటించటం ఇష్టం లేదని చెప్పుకొచ్చాడు.
ఇప్పుడు తను నటించిన మేజర్ సినిమా షూటింగ్ లో మహేష్ బాబూ వెన్నెముకలా నిలిచాడు అని ఈ సంధర్భంగా శేష్ తెలియచేశాడు.బాహుబలి సినిమాలో తాను నటించిన పాత్రకి తల్లి ఎవరో ఇప్పటివరకు రాజమౌళికి కూడ తెలియదని చెప్తూ నవ్వులు పూయించాడు.