మాఅధ్యక్ష ఎన్నికలలో నిన్న ప్రకాష్ రాజ్ ఓడిపోయిన తర్వాత.ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తాను తన మా సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు.బాధతో కాకుండా ఆత్మగౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
తెలుగువారు అధ్యక్షుడు కావాలని మా అసోసియేషన్ సభ్యులు కోరుకున్నారు.తెలుగువాడే గెలిచారు, నేను తెలుగువాడిగా పుట్టడం నా చేతిలో లేదు అంటూ భావోద్వేగంగా మాట్లాడారు.
ఈ తరుణంలో మా సభ్యత్వానికి రాజీనామా చేసి యథావిధిగాసినిమాలు చేస్తానని అతిథిగా ఉండాలని అన్నారు ఆ విధంగానే ఉంటాను.నా పని నేను చేసుకొని వెళ్తాను అని తెలిపారు.
ఈ క్రమంలో విలేకరులు 2019 ఎన్నికలలో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ఓడిపోయారు.అయినా కానీ రాజకీయాల్లోనే ఉంటూ రాణిస్తున్నారు అని.మీరెందుకు మా సభ్యత్వానికి రాజీనామా చేశారని విలేకరి ప్రశ్నించగా పవన్ కళ్యాణ్ లా నేను చేయలేను, నాకు ఆత్మాభిమానం ఉంటుంది.అయినా రాజకీయాలు వేరు అసోసియేషన్ ఎన్నికలు వేరు.దానికి దీనికి ముడిపెట్టొద్దు.ఇటువంటి అసోసియేషన్ లో పోరాడి మళ్లీ ఎన్నికలలో గెలవాలని.అటువంటి ఉద్దేశాలు తనకి లేవని ప్రకాష్ రాజ్ క్లారిటీ ఇచ్చారు.