నాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఒకవైపు తమిళం, మరోవైపు తెలుగు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం సాయి పల్లవి వరస తెలుగు తమిళ సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇకపోతే తాజాగా సాయి పల్లవి రానా ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం విరాటపర్వం.ఈ సినిమా జూన్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇకపోతే ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా ఇందులో నటించిన నటీనటుల పాత్రకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది.
ముఖ్యంగా వెన్నెల పాత్రలో నటించిన సాయి పల్లవి ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా నటించిందని ఈమె పాత్రకు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందాయని చెప్పాలి.
విరాటపర్వం సినిమా థియేటర్లో పెద్దగా ప్రేక్షకాదరణ నేచుకోలేకపోయిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో ప్రసారం అవుతుంది .ఈ క్రమంలోనే నటి సాయి పల్లవి సోషల్ మీడియా వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా సాయి పల్లవి స్పందిస్తూ ఇప్పటివరకు నటించిన సినిమాలలో విరాటపర్వం సినిమాలోని వెన్నెల పాత్ర నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలలో ఇది ఒకటి.ఈ సినిమాలో వెన్నెల పాత్రలో నటించినందుకు చాలా గర్వంగా ఉంది అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చారు.ఈరోజు (జులై 1) నుంచి ఈ సినిమా ఓటీటీలో ప్రసారంఅవుతుంది.
మీరందరూ తప్పకుండా ఈ సినిమాని చూస్తారని ఆశిస్తున్నాను అంటూ సాయి పల్లవి పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇకపోతే ప్రస్తుతం ఈమె తమిళంలో గార్గి అని సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.