ఈరోజు ఉదయం ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ని శ్రీకాకుళం జిల్లాలో నిమ్మాడలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.అనంతరం వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి తర్వాత కోర్టుకు తీసుకెళ్లడం జరిగింది.
ఇటువంటి తరుణంలో అచ్చెన్నాయుడు అరెస్ట్ తీరుపై ఏపీ టిడిపి పార్టీకి చెందిన నాయకులు తీవ్రస్థాయిలో ఖండించారు.ముఖ్యంగా పోలీసులు వ్యవహరించిన తీరును చాలా మంది తప్పుబట్టారు.
ఇటువంటి తరుణంలో అచ్చెన్నాయుడు తనను అరెస్టు చేసిన పోలీసులపై భారీ డైలాగులు వేశారు.మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు చంద్రబాబు నాయుడు ని ఒప్పించి హోంమంత్రి పదవిని తానే తీసుకుంటా అని పేర్కొన్నారు.
అంతేకాకుండా తప్పుడు కేసులు పెట్టిన ప్రతి పోలీస్ అధికారి ని గుర్తు పెట్టుకుంటాను అని, వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పుకొచ్చారు.తాను నాయకులను తప్పు పట్టడం లేదని, పోలీసులను తప్పు పడుతున్నా అంటూ సంచలన వార్నింగ్ ఇచ్చే రీతిలో వ్యాఖ్యానించారు.
ఏకంగా పోలీసు ఉన్నతాధికారుల అయుండి డి.ఎస్.పి, సిఐలు తన బెడ్ రూమ్ లోకి వచ్చారని, నోటీసు ఇస్తే తానే వచ్చేవాడిని కదా అసలు పోలీసులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని.పోలీసులను చూసి ఉద్యోగులంతా సిగ్గు పడుతున్నారు అంటూ అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
.