స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో జనవరి 12న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది.త్రివిక్రమ్ మార్క్ కథ ఈ సినిమాకు మేజర్ అసెట్ కాగా, బన్నీ యాక్టింగ్ సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్లింది.
ఈ సినిమాను అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు.
అయితే బన్నీ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తరువాత చాలా గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే.
ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేయడంతో బన్నీ తన నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేసేందుకు చాలా స్క్రిప్టులు వినాల్సి వచ్చిందని, సినిమా సైన్ చేసినా కూడా సరైన కథ దొరకలేదని అల్లు అరవింద్ తెలిపాడు.తాను త్రివిక్రమ్ కథను ఓకే చేసేందుకు చాలా సమయం తీసుకోవడం కారణంగానే బన్నీ సినిమాకు ఇంత లాంగ్ గ్యాప్ వచ్చిందని ఆయన చెప్పుకొచ్చాడు.
ఏదేమైనా లాంగ్ గ్యాప్ వచ్చినా, తాము అనుకున్న సక్సెస్ను మాత్రం అందుకోగలిగాము అంటూ చెప్పుకొచ్చాడు అల్లు అరవింద్.ఇక ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా, థమన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.