టాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు మురారి ఖడ్గం,ఇంద్ర,మన్మధుడు,శంకర్ దాదా ఎంబిబిఎస్ లాంటి తెలుగు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.తెలుగులో ఆమె నటించిన సినిమాలు అన్నీ కూడా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో అతి తక్కువ కాలంలోనే హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.2013లో హిందీలో వచ్చిన వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై దొబార చిత్రంలో అతిథిగా కనిపించిన ఆమె క్యాన్సర్ మహమ్మారితో పోరాడి గెలిచింది.
అమెరికాలో క్యాన్సర్కు చికిత్స చేయించుకుని ఆరోగ్యంతో తిరిగొచ్చిన విషయం తెలిసిందే.అయితే ఆమె క్యాన్సర్ బారిన పడిన తర్వాత ఆమె కోలుకోవాలి అని అభిమానులు ప్రార్థించారు.క్యాన్సల్ బారిన పడిన ఆమె ప్రస్తుతం రికవరీ అయ్యి మామూలు మనిషి అయిన విషయం తెలిసిందే.దీంతో తాజాగా సోనాలి బింద్రె ది బ్రోకెన్ న్యూస్ అనే వెబ్సిరీస్తో రీఎంట్రీ ఇచ్చింది.
ఇటీవల జూన్ 10న ఈ వెబ్ సిరీస్ జీ5లో విడుదలైంది.ఈ నేపథ్యంలో ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న సోనాలి బింద్రె ఇటీవల తనపై వస్తున్న పుకార్లను ఖండించింది.
సోనాలి బింద్రె ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని, అందుకే ఆమె మళ్లీ సినిమాలు చేసేందుకు రెడీ అయ్యిందంటూ బాలీవుడ్ మీడియాల్లో జోరుగా ప్రచారాలు కొనసాగగా తాజాగా సోనాలి బింద్రె ఈ వార్తలను కొట్టి పారెసింది.తాను ఆర్థికంగానూ, అన్ని విధాలుగా బాగున్నానని, ఆఫర్స్ కావాలణి అడుక్కోవాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేసింది.అలాగే తనకు డబ్బు సమస్య ఉందంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు.అలాగే తెలుగులో జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో రాబోయే ఎన్టీఆర్ 30 సినిమాల్లో తాను నటిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో సైతం నిజం కాదని వెల్లడించింది.
.