తెలుగు బిగ్ బాస్ ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా పదే పదే వార్తల్లో నిలుస్తుంది.అసలు ఈ సీజన్ ఉంటుందా ఉండదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కరోనా సెకండ్ వేవ్ తగ్గింది కనుక వెంటనే షో ప్రారంభించే అవకాశం ఉందని కూడా ప్రచారం మొదలు అయ్యింది.ఈ నేపథ్యంలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 గురించి ఇంట్రెస్టింగ్ పుకార్లు షికార్లు చేయడం మొదలు అయ్యింది.
కరోనా సమయం అయినా కూడా సీజన్ 5 మొదలు కాబోతుంది.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని హైపర్ ఆది, శేఖర్ మాస్టర్ తో పాటు ప్రముఖులను షో కు ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి.
అసలు షో ఉంటుందో లేదో అనే అనుమానాలు ఉన్న ఈ సమయంలో హైపర్ ఆది మరియు శేఖర్ మాస్టర్ వంటి స్టార్స్ ను ఎంపిక చేసినట్లుగా వార్తలు రావడం ఆశ్చర్యంగా ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
హైపర్ ఆది నిజంగానే బిగ్ బాస్ కు వెళ్లబోతున్నాడా అనే విషయమై జబర్దస్త్ టీమ్ స్పందించింది.
ఆ వార్తలు అన్ని కూడా పుకార్లే అంటూ తేల్చి చెప్పేశారు.ముఖ్యంగా హైపర్ ఆది వంటి స్టార్ జబర్దస్త్ ను వదిలేసి వెళ్తాడు అని ఎవరు అనుకోవడం లేదు.
సరే బిగ్ బాస్ చేసి వచ్చి కొన్నాళ్ల తర్వాత మళ్లీ జబర్దస్త్ కు వెళ్లవచ్చు అనుకోవడానికి లేదు.ఒక్క సారి జబర్దస్త్ ను వదిలేస్తే మళ్లీ అడుగు పెట్టడం సాధ్యం కాదు.
ముఖ్యంగా స్టార్ మా షోల్లో కనిపించిన వారికి మళ్లీ జబర్దస్త్ లో అవకాశం లేనే లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు ప్రతి ఒక్కిరికి తెల్సిందే.
మల్లె మాల వారితో తెగ తెంపులు చేసుకోవాల్సిందే.అంటే అందుకు గాను భారీ మొత్తంలో మల్లెమాల వారికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.మరి ఆది ఆపని చేసిన మరీ బిగ్ బాస్ కు వెళ్తాడా అంటే ఖచ్చితంగా లేదు అనే అంటున్నారు.
సినిమా లు చేస్తే చేయవచ్చు కాని బిగ్ బాస్ షో కు మాత్రం వెళ్లడని అంటున్నారు. సమంత హోస్ట్ గా వచ్చిన సమయంలో ఆది బిగ్ బాస్ స్క్రీన్ పై సందడి చేసిన విషయం తెల్సిందే.