ప్రస్తుతం టాలీవుడ్ లో జబర్దస్త్ షో లో కమెడియన్లుగా నటిస్తున్నటువంటి దొరబాబు మరియు పరదేశి ఇటీవలే వ్యభిచారం కేసులో దొరికిపోయిన సంగతి ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది.అయితే జబర్దస్త్ షో ని నిర్వహిస్తున్నటువంటి షో నిర్వాహకులు కూడా ఈ ఇద్దరినీ ఉంచాలా తీసేయాలనే అన్న సందిగ్ధంలో పడ్డారు.
అయితే హైపర్ ఆది టీం లో ఇద్దరూ మెయిన్ కమెడియన్ గా పని చేస్తున్నారు.అంతేగాక ఒక పక్క నటిస్తూనే పరదేశి స్క్రిప్ట్ రైటర్ గా కూడా పని చేస్తున్నాడు.
దీంతో ఈ ఇద్దరి విషయం పై షో నిర్వాహకులు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే నిర్ణయాన్ని హైపర్ ఆది కే వదిలేసినట్లు తెలుస్తోంది.అయితే మరి ఇద్దరి విషయంలో హైపర్ ఆది ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
ఈ విషయంపై కొందరు నెటిజన్ల స్పందిస్తూ సినిమా పరిశ్రమలో ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయని, గతంలో కూడా ఇలాంటి కేసుల్లో దొరికినటువంటి నటీనటులు కొంతకాలం సినీ పరిశ్రమకు దూరంగా ఉండి మళ్ళీ నటిస్తున్నారని ఇదంతా కామనే అని అంటున్నారు.
జబర్దస్త్ లో దొరబాబు మరియు పరదేశి కమెడియన్లు గానే కాకుండా వ్యక్తిగతంగా కూడా హైపర్ ఆది తో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.అలాంటిది మరి దొరబాబు, పరదేశి ల విషయంలో హైపర్ ఆది ఏం చేస్తాడో చూడాలి.ఏదేమైనప్పటికీ పెళ్ళై పిల్లలున్నటువంటి దొరబాబు ఇలా చేసి ఉండకూడదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
అంతేగాక పరదేశి కూడా అష్టకష్టాలు పడుతూ సినీ పరిశ్రమకి వచ్చాడని కానీ వచ్చిన పని మరచి ఇలాంటి అసాంఘీక పనులు చేయడంతో ఆదిలోనే చెడ్డ పేరుని మూటగట్టుకున్నాడు.
.