ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ గురించి అందరికీ తెలిసిందే.ఇక ఈ షో లో జరిగే కామెడీలు అంతా ఇంతా కాదు.
ఇందులో పాల్గొనే కమెడియన్స్ తమ టీమ్ లతో కలిసి ఎంతో వినోదాన్ని పంచుతారు.అంతేకాకుండా జబర్దస్త్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లు వెండితెరపై కూడా అవకాశాలను దక్కించుకుంటారు.
ప్రస్తుతం సినిమాల్లో కమెడియన్ లను జబర్దస్త్ నుండే తీసుకుంటున్నారు.
ఇక ఈ షో దాదాపు 8 ఏళ్లు నుండి ప్రసారమవుతుంది.
ఇందులో హైపర్ ఆది, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ వంటి పలువురు కమెడియన్స్ గురించి అందరికీ తెలిసిందే.ఇందులో హైపర్ ఆది తన పంచులతో స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు.
తను ఇచ్చే పంచ్ డైలాగులు మాత్రం అవతలి వాళ్ళని కించపరిచేలా చేస్తాడు.స్కిట్ లతో ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసే కమెడియన్స్ లలో హైపర్ ఆది ఒక్కడే.
ఆ మధ్య బయట వాళ్ళని టార్గెట్ చేయడం వల్ల కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నాడు హైపర్ ఆది.అంతేకాకుండా వెండితెరపై కొన్ని సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.తాజాగా ఆయన జబర్దస్త్ కామెడీయన్ల పాడు పనుల గురించి గోవాలో కష్టమేనంటూ షాక్ ఇచ్చాడు.
ఇటీవలే హైపర్ ఆది టీమ్ లో పని చేస్తున్న ఇద్దరు కమెడియన్లు దొరబాబు, పరదేశి వ్యభిచారం చేస్తూ పట్టుబడిన సంగతి తెలిసిందే.ఈ కేసు పెద్ద సంచనలగా మారింది.ఇక వీళ్లను ఉద్దేశిస్తూ ఆది పంచులు కూడా చేసేవాడు.
ఇక తాజాగా వీరి గురించి మరో పంచ్ వేయగా వైరల్ గా మారింది.వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్ లో హైపర్ ఆది తన భార్య రోహిణి తో కలిసి గోవా కి వెళ్తాడు.ఇక స్కిట్ లో భాగంగా మాట్లాడుతూ.“గోవా వచ్చాం.జాగ్రత్తగా ఉండండి ఓకేనా.అదంటే మన ఏరియా కాబట్టి చేతులు పట్టుకుంటే వదిలేశారు.ఇక్కడ అలా కాదు” అంటూ ఆది వారి పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.ఈ క్రమంలో వారి స్కిట్ ఆపి మధ్యలోనే నవ్వుకున్నారు.