బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ షోకు గత కొన్నేళ్లుగా అనసూయ యాంకర్ గా ఉన్నారనే సంగతి తెలిసిందే.హైపర్ ఆది జబర్దస్త్ షో ప్రారంభమైన కొన్నేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చినా తక్కువ సమయంలోనే ఇతర కమెడియన్లను మించి మంచి కామెడీ టైమింగ్ ఉన్న కమెడియన్ గా పేరు సొంతం చేసుకున్నారు.
తాజాగా జబర్దస్త్ షో ప్రోమో రిలీజ్ కాగా ప్రోమోలో హైపర్ ఆది అనసూయ పరువు తీసేశారు.
ఎదురులేని మనిషి సినిమాలోని ఏమైందమ్మా ఈనాడు పాటతో హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చి ఆ వేలం పాట పాడేవాళ్లు ఎవరో ఉన్నారట కదా వాళ్లను పిలిపించండి అని చెబుతాడు.
అనసూయ స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చి అనసూయ ఇక్కడ.కొంచెమైనా ఉందా అని అడగగా ఆది ఇక్కడ.మరేమైనా ఉందా అని చెబుతాడు.ఆ తర్వాత శాంతి స్వరూప్ లేడీస్ గెటప్ లో ఎంట్రీ ఇచ్చి వచ్చేశా అని చెబుతాడు.
షాపులో ఎవరైనా కొనాలి పూజ చేయాలి ఆ తర్వాత వస్తే పదో పాతికో ఇస్తామంటూ హైపర్ ఆది కామెంట్లు చేస్తాడు.
ఆ తర్వాత ఆది అనసూయతో దోశ చేయడం పెద్ద విషయం కాదని ఇలా ఇలా తిప్పితే దోశ అవుతుందని చెప్పగా అనసూయ నాకు దోశ వెయ్యడం వచ్చేసిందని అనసూయ చెప్పగా అప్పుడే రాకూడదని నేనింకా రెండుసార్లు తిప్పాలని ఆది చెబుతాడు.ఆ తర్వాత కమెడియన్ నువ్వు తోపెహ పూరి అని అంటాడు.
అలా చేస్తే ఏమొస్తుందని ఆది కమెడియన్ ను అడగగా పొగిడితే పూరీ పొంగుతుంది కదా అని చెబుతాడు.ఇలాంటి డైలాగ్స్ ఆడియన్స్ తిడతారని ఆది చెబుతాడు.ఇడ్లీలో ఏంటి తెల్ల వెంట్రుక వచ్చిందని చెప్పగా హైపర్ ఆది అనసూయ చూసుకొని చేయాలి కదరా అంటూ పంచ్ వేశారు.
తన పరువు తీసేలా చేయడంతో అనసూయ ఆదిని కొట్టడానికి వస్తారు.