బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా పరిచయమైన హైపర్ ఆది పంచ్ డైలాగులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే.ఈయన అద్భుతమైన కామెడీ ప్రజలకు విశేష ప్రేక్షకాదరణ ఉంది.
ఇదిలా ఉండగా హైపర్ ఆది జబర్దస్త్ వేదికపై లేదా ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా చేసే స్కిట్ ద్వారా ఎంతో పాపులర్ అవుతారు.అయితే అప్పటి వరకు సోషల్ మీడియాలో ఎవరైతే ట్రెండింగ్ లో ఉంటారో వారిని టార్గెట్ చేస్తూ హైపర్ ఆది స్కిట్ లు తీవ్ర దూమారం రేపుతుంటాయి.
ఈ క్రమంలోనే హైపర్ గతంలో కత్తి మహేష్, రాకేష్ మాస్టర్, శ్రీరెడ్డి గురించి తనదైన శైలిలో సెటైర్లు వేశారు.
ఇలా హైపర్ ఆది వేసే సెటైర్లు కొన్నిసార్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఈ క్రమంలోనే హైపర్ ఆది ఎన్నోసార్లు క్షమాపణలు కూడా చెప్పారు.ఇదిలా ఉండగా దీపావళి పండుగ సందర్భంగా ఈ టీవీ కార్యక్రమం తగ్గేదేలే అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఢీ కార్యక్రమంలో డి కంటెస్టెంట్ ఇద్దరు ఒకే వేదికపై సందడి చేశారు.తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేయడంతో ఈ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఇందులో హైపర్ ఆది మంచు విష్ణు టార్గెట్ చేస్తూ చేసిన వైరల్ గా మారింది.
మా ఎన్నికలలో భాగంగా మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు గురించి పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఈ క్రమంలోనే హైపర్ ఆది అదే మాటలను ఇక్కడ ఇమిటేట్ చేయడంతో ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.ఇక మా ఎన్నికల సమయంలో భాగంగా మంచు విష్ణు ఎక్కువగా లెట్ దెమ్ నో అంకుల్ అనే పదాన్ని వాడారు.
ఈ క్రమంలోనే హైపర్ ఆది స్కిట్ లో భాగంగా అన్ని నీకే తెలిసినట్టు మాట్లాడతారు ఇంతకుముందు ప్రియమణి మా సైడ్ నుంచి వచ్చి ఏమన్నారంటే అని హైపర్ ఆది అనగా హా ఏమన్నారు అని రోజా అడగడంతో రాంప్రసాద్ అందరూ ఆదిని పట్టుకొని వుండగా అది వెంటనే లెట్ దెమ్ నో అంకుల్ లెట్ దెమ్ నో అంటూ ఒక్కసారిగా విష్ణుని గుర్తు చేశారు.ఇలా మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలను హైపర్ ఆది చేయడంతో ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి.