బుల్లితెర కామెడీ షోలలో ఒకటైన జబర్దస్త్ షో 2013 సంవత్సరంలో ప్రారంభమైంది.సంవత్సరాలు గడుస్తున్నా ఈ షో చూసే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.
ఎంతోమంది కమెడియన్లు జబర్దస్త్ షో ద్వారా గుర్తింపుతో పాటు మంచిపేరు సంపాదించుకున్నారు.ఇతర టీమ్ లీడర్ల స్కిట్లతో పోలిస్తే హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ చేస్తున్న స్కిట్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా జబర్దస్త్ షో ప్రోమో రిలీజ్ కాగా అనసూయ వయస్సు గురించి హైపర్ ఆది చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.అనసూయ ఆదితో “నాన్నమ్మ తాతయ్య ఖాళీగా ఉన్నారంట.
ఒక మనవడిని ఇస్తే ఆడుకుంటామని చెబుతున్నారు” అని చెబుతారు.వాళ్లు ఖాళీగా ఉంటే వాళ్లనే ఒక కొడుకును కని ఆడుకొమ్మను మనకు అంత సీన్ లేదని చెప్పండి అంటూ పంచ్ వేస్తాడు.
ఆ తరువాత అనసూయను “పైన పటారం లోన లొటారం” పాట నా గురించి చేశావా.? అని ఆది ప్రశ్నిస్తాడు.
అనసూయ వెంటనే అయ్యయ్యో ఎంతమాట ఎంతమాట అంటూ లెంపలు వేసుకుంటారు.అనసూయ నన్ను చూడు.నన్ను చూస్తే ఏమనిపిస్తుంది అని అడగగా మీరెప్పటికీ ముసలోడు అవ్వకూడదని అనిపిస్తుంది అంటూ అనసూయ పంచ్ వేస్తారు.నువ్వేమో ఆల్రెడీ ముసలిదానివి అయిపోవచ్చు నేను అవ్వకూడదా అని ఆది రివర్స్ లో పంచ్ వేస్తాడు.
అనసూయ ఆది వేసిన పంచ్ కు పకపకా నవ్వేస్తారు.
వచ్చే గురువారం రోజున ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
రోజా ఆరోగ్య సమస్యల ఆస్పత్రిలో ఉండటంతో ఆమెకు బదులుగా ఇతర సెలబ్రిటీలు ఈ షోకు జడ్జిగా హాజరవుతున్నారు.ప్రముఖ నటి ఇంద్రజ ఈ ఎపిసోడ్ కు గెస్ట్ గా హాజరయ్యారు.
రోజా కొన్ని వారాల పాటు రెస్ట్ తీసుకుని జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం.