బుల్లితెర కమెడియన్ హైపర్ ఆది వేసే పంచ్ లు కొన్నిసార్లు శృతి మించుతాయని నెటిజన్ల నుంచి విమర్శలు వినిపిస్తూ ఉంటాయి.అయితే ఆది మాత్రం ప్రేక్షకులను నవ్వించడానికే స్కిట్లు చేస్తారు కాబట్టి చాలామంది అభిమానులు ఆ విమర్శను పెద్దగా పట్టించుకోరు.
అయితే తాజాగా హైపర్ ఆది మనసంతా నువ్వే స్పూఫ్ చేయగా ఆ స్పూఫ్ లో శాంతిస్వరూప్ పై కామెంట్లు చేస్తూ పంచ్ లు చేశారు.మనసంతా నువ్వే సినిమాలోని చెప్పవే ప్రేమ సాంగ్ తో హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చారు.
తాను మనసంతా నువ్వేలో ఉదయ్ కిరణ్ అని ఆది చెప్పగా లేడీ గెటప్ లో ఉన్న యువతి ఆది నేను నీ రీమాసేన్ ను గుర్తుపట్టలేదా అని అడుగుతుంది.ఆది వెంటనే తనకు స్కిట్ కు ఒక రీమాసేన్ వస్తుందని చెప్పుకొచ్చారు.
ఆది మనం చిన్నప్పుడు ట్యూబులతో ఆడుకున్నాం గుర్తుందా అని నటి అడగగా ఇప్పుడు ట్యూబులతో ఆడుకుంటే యూట్యూబ్ లో పెడతారని ఆది చెబుతాడు.
ఆ తరువాత దొరబాబు, శాంతి స్వరూప్ ఎంట్రీ ఇచ్చారు.
దొరబాబు లేడీ గెటప్ లో ఉన్న శాంతి స్వరూప్ తో మనకు పెళ్లైన తరువాత శోభనం ఎక్కడ చేసుకుందాం అని అడుగుతాడు.ఆది వెంటనే దాన్ని చూస్తే భోజనమే చేయలేని శోభనం ఎలా చేస్తావంటూ శాంతి స్వరూప్ పరువు తీసేశాడు.
ఆ తరువాత దొరబాబు ఊటీకు వెళదామంటే శాంతి స్వరూప్ కశ్మీర్ కు వెళదామని చెప్పగా ఆది కశ్మీర్ బాగుంటుందని చెబుతాడు.శాంతి స్వరూప్ వెంటనే నువ్వు ఊటీకెళ్లు అంటూ ఆదికి రివర్స్ పంచ్ వేస్తారు.
జూన్ నెల 10వ తేదీన రాత్రి 9.30 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.చలాకీ చంటి, అదిరే అభి ప్రోమోలో వేసిన పంచ్ లు బాగా పేలాయి
.