తెలుగు బుల్లితెర మీద మొదలు పెట్టిన అనతి కాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న“బిగ్ బాస్ రియాల్టీ షో” గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఇప్పటికీ ఈ రియాల్టీ గేమ్ షో మూడు సీజన్లను విజయ వంతంగా పూర్తి చేసుకుని నాలుగో సీజన్ వైపు వడివడిగా అడుగులు వేస్తోంది.
అయితే ఈ బిగ్ బాస్ షోలో పాల్గొన్నటువంటి కంటెస్టెంట్లకు కూడా రోజుకి దాదాపుగా లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. అంతేగాక పలు కొత్త చిత్ర అవకాశాలు కూడా వస్తాయిని ఆర్టిస్టులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో చాలామంది ఆర్టిస్టుల మరియు సెలబ్రిటీలు బిగ్ బాస్ షోలో పాల్గొనాలని కలలు కంటూ ఉంటారు.అయితే తాజాగా బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం వచ్చినప్పటికీ జబర్దస్త్ కమెడియన్ నిర్మొహమాటంగా నో చెప్పినట్లు వార్తలు సోషల్ మీడియా వాదనల్లో తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే ఇంతకీ ఆ కమేడియన్ ఎవరంటే జబర్దస్త్ కామెడీ షో లో తన పంచులతో హిలేరియస్ గా నవ్వించే హైపర్ ఆది ఇటీవలే తనకు బిగ్ బాస్ రియాల్టీ షో నాలుగవ సీజన్ లో పాల్గొని అవకాశం వచ్చినప్పటికీ నో చెప్పాడట.
అయితే షో నిర్వాహకులు ఒక ఎపిసోడ్ కి దాదాపుగా 7 లక్షల రూపాయలు పారితోషకం ఆఫర్ చేసినప్పటికీ ఎందుకో హైపర్ ఆది ఒప్పుకోలేదని కొందరు సోషల్ మీడియా మాధ్యమాలను చర్చించుకుంటున్నారు.
అయితే ఈ బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్ గా వచ్చినటువంటి ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్లు వినిపిస్తున్న వార్తల పై మాత్రం ఇప్పటివరకు హైపర్ఆది స్పందించలేదు.
దీంతో ఈ వార్తల్లో నిజమైన అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.దీంతో కొంతమేర ఆలస్యంగా బిగ్ బాస్ 4వ సీజన్ మొదలు కానున్నట్లు సమాచారం.