తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం హైపర్ ఆది బుల్లితెరపై టాప్ కమెడియన్లలో ఒకరిగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
తెలుగు బుల్లితెరపై జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ, లాంటి షోలలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బనవ్విస్తున్నాడు.హైపర్ ఆది పంచుల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ప్రతి ఒక్కరిపై వరుసగా పంచులు వేస్తూ అందరినీ కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు.అంతేకాకుండా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ,ఢీ షో లను ఆది కామెడీ కోసమే చూసేవారు ఉన్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
అయితే కొన్ని కొన్ని సార్లు హైపర్ ఆది మితిమీరిన పంచులు వేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ను ఎదుర్కొంటూ ఉంటారు.ఈ మధ్యకాలంలో హైపర్ ఆది ఎక్కువగా డబుల్ మీనింగ్ డైలాగులు పంచులు ఎక్కువ అయ్యాయి అంటూ నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో హైపర్ ఆదికి సంబంధించిన ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది.అదేమిటంటే హైపర్ ఆది జబర్దస్త్ లో ఒక్కొక్క స్కిట్ కు గాను ఎంత పారితోషికం అందుకుంటాడు అన్న వార్తపై అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా ఇదే వార్తపై హైపర్ ఆది మొదటిసారిగా స్పందించాడు.ఇదే విషయంపై స్టేజ్ పై స్పందిస్తూ.
మేము ఒక్కొక్క స్కిట్ చేయాలి అంటే చాలా వరకు శ్రమించాలి పంచులు రాసుకోవాలి డైలాగు రాసుకోవాలి ఇలా చాలా కష్టం ఉంటుంది అందుకే మేము ఒక్కొక్క స్కిట్ కోసం ఇంత తీసుకుంటాము అంటూ తన నోటితో చెప్పకుండా రెండు చేతులతో చూపిస్తూ సైగలు చేశాడు.హైపర్ ఆది ఒకవైపు బుల్లితెరపై కమెడియన్ గా చేస్తూ ప్రేక్షకులను నవ్విస్తూనే మరొకవైపు వెండితెరపై చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు.