తెలుగు రాష్ట్రాల్లో ఏ పండుగ జరిగినా ఈటీవీ ఛానల్ లో ఈవెంట్ ప్రసారమవుతుందనే సంగతి తెలిసిందే.ఈవెంట్లకు టీఆర్పీ రేటింగ్ లు భారీగా వస్తుండటంతో నిర్వాహకులు సైతం ఈవెంట్లపై తెగ ఆసక్తి చూపుతున్నారు.
జబర్దస్త్ షో ద్వారా గుర్తింపును సొంతం చేసుకున్న కమెడియన్లలో హైపర్ ఆది ఒకరు.గత కొన్నేళ్లుగా హైపర్ ఆది ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు.
అయితే ఈ షోలో హైపర్ ఆది రోజాతో గొడవ పడటం గమనార్హం.ప్రకాశం జిల్లాకు చెందిన హైపర్ ఆది అదిరే అభి స్కిట్ ద్వారా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
కెరీర్ తొలినాళ్లలో హైపర్ ఆది స్క్రిప్ట్ రైటర్ గా కూడా పని చేశారు.కమెడియన్ గా చిన్నచిన్న రోల్స్ చేసిన హైపర్ ఆది తర్వాత రోజుల్లో స్టార్ కమెడియన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.
హైపర్ ఆదికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా యూట్యూబ్ లో ఆదికి రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.
హైపర్ ఆది వేసే పంచ్ లు పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంటాయి.
హైపర్ ఆది తర్వాత చాలామంది కమెడియన్లు ఎంట్రీ ఇచ్చినా హైపర్ ఆది స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకోలేకపోయారు.దీపావళి కానుకగా ఈటీవీలో ప్రసారం కానున్న తగ్గేదేలే ప్రోగ్రాంలో పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు పూర్ణ అద్భుతంగా స్టెప్పులు వేసి మెప్పించడం గమనార్హం.
ఈ ఈవెంట్ లో సైగల ద్వారా సినిమాను చెప్పే టాస్క్ లో భాగంగా ప్రియమణి ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వగా రోజా టీమ్ సభ్యులు కరెక్ట్ గా చెప్పారు.ఆ తర్వాత హైపర్ ఆది ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వగా రామ్ ప్రసాద్ మూవీ నేమ్ కరెక్ట్ గా చెబుతాడు.రోజా హైపర్ ఆదితో మీరు సరిగ్గా ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వలేదని చెప్పగా హైపర్ ఆది ఇది ఎక్స్ ప్రెషన్ కాదు ఇది ఎక్స్ ప్రెషన్ అంటూ సైగలు చేస్తూ ఊరుకో అని గొడవ పడగటం గమనార్హం.