అదేంటో గానీ ఈ మధ్యన అడవి జంతువులు విపరీతంగా జనావాసాల్లోకి రావడం మనం చూస్తూనే ఉన్నాం.అయితే అడవులు తరిగిపోవడమో లేదంటే ఇంకేందైనా కారణం కావచ్చుగానీ ఇలా అడవిలో ఆ జతువులకు కావాల్సిన ఆహారం దొరకక ఇలా జనావాసాల్లోకి వస్తున్నాయి.
ఇక అడవి ప్రాంతాలకు దగ్గరగా ఉన్న ఊర్లకు వీటి తాకిడి ఎక్కువగా ఉంటోంది.ఇక అప్పుడప్పుడు ఇవి రోడ్డు బాట పడుతున్నాయి.
మరి ఇలా సడెన్గా క్రూర మృగాలు జనావాలస్లోకి వస్తే ఇంకేమైనా ఉందా ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అందరికీ తెలిసిందే.
ఇక ఇలాంటి దాడుల వార్తలు మనం పేపర్లలలో టీవీల్లో చూస్తుంటేనే భయం వేస్తుంది.
అలాంటిది ఇంక ప్రత్యక్షంగా ఎదుర్కున్న వారికి ఇంకాలా ఉంటుంది కదా.అయితే ప్రస్తుతం ఇలాటి ఘటనే ఒకటి మహారాష్ట్రలోని పుణెలోనూ జరిగింది.
కాగా అది కూడా ఓ నడిరోడ్డుమీద చోటు చేసుకుంది.పుణెలోని ఖేడ్ తహసీల్ ఏరియాలో ఎక్కువగా అటవీ ప్రాంతం ఉంటుంది.
అయితే ఇక్కడ ఓ రోడ్డుపై వృద్ధుడు ఏదో ఒక పనిమీద నడుచుకుంటూ పోతున్నారు.ఇక ఆ మార్గం గుండా కూడా చాలామంది నడుస్తూనే ఉన్నారు.
కొందరు బైకుల మీద వెళ్తున్నారు.
అయితే పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలో నుంచి సడెన్ గా ఒక మెరుపు వేగంతో వచ్చి ఆ వృద్ధుడిమీద దాడి చేసింది.
వస్తూనే ఆ వృద్ధుడిని నోటితో కరవడం స్టార్ట్ చేసింది.కానీ అక్కడే ఉన్న మరో యువకుడు చేతులో ఉన్న కర్ర తీసుకుని ఏ మాత్రం భయపడకుండా ఆ హైనాను తుక్కు తుక్కు కొట్టాడు.
ఇంకేముంది ఆ హైనా అక్కడి నుచి పారిపోయింది.కాగా ఈ ఘటనను మొత్తం అక్కడ ఉన్న యువకులు వీడియో తీయగా ప్రస్తుతం అది వైరల్గా అయిపోయింది.ఇక దీన్ని చూస్తేనే అత్యంత భయంకరంగా ఉందంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.