ప్రస్తుతం హైదరాబాద్ నగరం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హబ్ గా మారబోతుందా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మాత్రం అలాగే ఉంటున్నాయి.మొన్నటివరకు తెలుగు సినిమాలు తెలుగులో తమిళ సినిమాలు తమిళ్ లో హిందీ సినిమాలు హిందీ లో ఎక్కువగా ఆడేవి.
మిగతా హీరోల సినిమాలు వచ్చినా ప్రేక్షకులు అంతగా పట్టించుకునే వారు కాదు.కానీ ఇప్పుడు మాత్రం తెలుగు తమిళం హిందీ అనే తేడా లేకుండా అన్ని భాషల ప్రేక్షకులు సినిమాలను ఆస్వాదిస్తున్నారు.
కానీ హీరో ఎవరన్నది చూడటం లేదు.ఇలాంటి సమయంలోనే అటు టాలీవుడ్ నుంచి ఎన్నో సినిమాలు భారత దేశంలోని అన్ని భాషల్లో కూడా సూపర్ హిట్ అవుతున్నాయి.
ఓవర్సీస్లో కూడా మంచి మార్కెట్ సంపాదిస్తూన్నాం.దీంతో బాలీవుడ్ కోలీవుడ్ అనే తేడా లేదు అన్ని ఇండస్ట్రీల చూపు కూడా టాలీవుడ్పై పడిపోయింది అన్నట్లు తెలుస్తోంది.
దీంతో అక్కడి హీరోలు ఇక్కడి దర్శకులతో సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.అంతే కాదు తెలుగు హీరోలతో కలిసి నటించేందుకు కూడా రెడీ అవుతున్నారు.
అంతేకాదు ఇక భాషలతో సంబంధం లేకుండా హీరోల మధ్య మంచి స్నేహ బంధం కూడా కొనసాగుతుందని తెలుస్తోంది.ఇటీవలి కాలంలో హిందీ హీరోలు తమిళ హీరోలు హైదరాబాద్ లో షూటింగ్ చేస్తూ ఉంటే వారిని ఇంటికి పిలిచి మరీ డిన్నర్ పార్టీ ఇస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి.
ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ లోకేష్ కనకరాజు లాంటి వాళ్లని చిరంజీవి ఇంటికి పిలిపించి కలిశారు.ఇటీవలే రామ్ ఉపాసన సల్మాన్ ఖాన్ వెంకటేష్ కూడా ఒక చోట కలిశారు అనే విషయం తెలిసిందే.ఇక మరోవైపు ప్రభాస్, ప్రశాంత్ నీల్, అమితాబచ్చన్ రాఘవేంద్రరావు, నాని, దుల్కర్ సల్మాన్, నాగ్ అశ్విన్ కూడా ఒక చోట కలి మినీ సి సైజు పార్టీ చేసుకున్నారు.హీరోలందరూ భాషల హద్దులు చెరిపేసిన ఉన్నారు.
అంతే కాదు ఇతర భాషల హీరోలు సైతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ రామానాయుడు స్టూడియో నానక్ రామ్ గూడలోని ఖాళీ స్థలాల్లో సెట్లు వేసి షూటింగులు పెట్టుకుంటున్నారు.ఇక ఇవన్నీ చూస్తుంటే రానున్న రోజుల్లో హైదరాబాద్ ఇండస్ట్రీ హబ్ గా మారబోతుంది అన్నది మాత్రం పక్కా గా చెప్పొచ్చు.