నగరంలో రోడ్ల మీద తిరిగే వాహనాలను లెక్కించడం చాలా కష్టం.రోజుకు లెక్కలేనన్ని వాహనాలు ఇక్కడ పరిగెడుతుంటాయి.
ఇక వాటి నుండి విడుదల అయ్యే కాలుష్యాన్ని గమనిస్తే అయ్యబాబోయ్ అనక తప్పదు.ఎందుకంటే నిత్యం నగర రోడ్లు రద్దీగానే కనిపిస్తాయి.
ఇక ట్రాఫిక్ జాం అయితే గనుక చుక్కలు కనిపిస్తుంది.
అయితే ఇలా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో చికాకు తెప్పించే సంఘటన ఏంటంటే.
రైయ్యిన దూసుకు వచ్చే వాహనాల నుండి వచ్చే హారన్ సౌండ్స్.చెవులు చిల్లులు పడేలా బైకు సైలెన్సర్ల ధ్వని.
వీటి వల్ల విడుదల అయిన కాలుష్యం వల్ల చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారన్నారట.అందుకే ఇలాంటి వారి విషయంలో శ్రద్ద వహించిన ట్రాఫిక్ పోలీసులు.
ఇష్టమొచ్చినట్లు హారన్లు మోగిస్తూ శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న వారిపై కొరడా ఝళిపిస్తున్నారు.

జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు.శనివారం బంజారాహిల్స్, కేబీఆర్ పార్క్ వద్ద ప్రత్యేక నిర్వహించిన కార్యక్రమంలో రోడ్లపై సౌండ్ పొల్యూషన్ చేస్తున్న బైకులను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు.ఇకపోతే ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం 65 డెసిబుల్స్ సౌండ్ మించితే శబ్ద కాలుష్యంగా పరిగణించాల్సి ఉంటుందని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్ కుమార్ అన్నారు.
అలాగే 75 డెసిబుల్స్ ఉంటే హానికరం.120 డెసిబుల్స్ కంటే ఎక్కువగా ఉంటే అది పెయిన్ ఫుల్గా పరిగణించాల్సి వస్తుందని పేర్కొన్నారు.కాగా తొలిసారి సౌండ్ పొల్యూషన్ వల్ల దొరికితే 1000 రూపాయల జరిమానా, రెండో సారి పట్టుపడితే 2000 రూపాయల జరిమానా విధిస్తామని ఆయన హెచ్చరించారు.అంటే ఇప్పటి నుండి వీలైనంత సైలన్స్గా నగర రోడ్ల మీద నుండి వెళ్లాలన్న మాట.