హైదరాబాద్ నగరం లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ఓ ఫంక్షన్ కార్యక్రమానికి వెళ్లిన ఇద్దరు యువకులు తిరిగి ఇంటికి వచ్చే చేస్తుండగా సరిగ్గా పాతబస్తీ మీర్ చౌక్ వద్ద ఎంజీబీఎస్ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
ఇద్దరు యువకులు బైక్ గుంట నుండి తప్పించి కిందపడిపోయారు.
ఇదే సమయంలో ఎదురుగా ఒక లారీ రావడంతో వారిద్దరిపై నుండి దూసుకెళ్లి అక్కడికక్కడే ఇద్దరు యువకులు మరణించడం జరిగింది.
ఘటన జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.మృతి చెందిన ఇద్దరు యువకుల వివరాలు చూస్తే ఇద్దరూ కూడా చదర్ ఘాట్ ముసా నగర్ ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించడం జరిగింది.
మృతుల వివరాలు చూస్తే ఒకరు ఫసీ ఖాన్(19) కాగా మరొకరు మోసిన్ (23)గా తేలింది.
.